ఏలూరు
ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మారంపల్లి నుంచి ద్వారకాతిరులకు టిడిపి శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రగా వస్తున్న టిడిపి నాయకుల్ని కార్యకర్తలను పోలీసులు అడ్డగించారు. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని టిడిపి నాయకులు ప్రశ్నించారు. టిడిపి నాయకులు అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో పోలీసులకి టిడిపి నాయకులు మధ్య తీవ్రవాగ్వాదం, తోపులాట జరిగింది. పాదయాత్రను మాత్రం ఆపమని టిడిపి కార్యకర్తలు అంటున్నారు.