Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

నార్సింగిలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ పై కేసు నమోదు

0

హైదరాబాద్

నార్సింగ్ భూవివాదంలో ఎమ్మెల్సీ  వెంకట్రామిరెడ్డి, కొల్లాపూర్  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి లపై నార్సింగి పోలీస్ ఠాణాలో  కేసు నమోదయింది. గోల్డ్ ఫిష్ అడోబ్ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసారు. అడోబ్ సంస్థ స్థలం లోకి అక్రమంగా చొరబడ్డారంటూ ఫిర్యాదు లో వుంది. కోకాపేటలో రెండున్నర ఎకరాల స్థల వివాదంలో కేసులు నమోదు అయింది. 60 మందితో వచ్చి తమ స్థలంలో దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఫిర్యాదు లో పేర్కోన్నారు.  వీరిద్దరితోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

కోకాపేటలోని సర్వే నంబరు 85లో 2 ఎకరాల 30 గుంటల భూమిపై పెట్టుబడిదారులు, డెవలపర్ మధ్య వివాదం నెలకొంది. దీన్ని పరిష్కరించుకోకుండా డెవలపర్ నిర్మించిన తాత్కాలిక గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు ఖాళీ చేయించారని డెవలపర్ ప్రతినిధి గుండు శ్రవణ్ ఫిర్యాదు చేయగా అదేరోజు పోలీసులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై ఐపీసీ 447, 427 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కోకాపేటలోని సర్వేనంబరు 85లోని స్థలాన్ని గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ కొద్ది నెలల నుంచి అభివృద్ధి చేస్తోంది. ‘‘గోల్డ్ఫిష్ సంస్థతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్రెడ్డికి కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతోంది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి దాదాపు 60 మందికిపైగా కోకాపేటలోని స్థలానికి వచ్చారు. గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యం చేశారు.
 ఎమ్మెల్సీ అనుచరులు కూలీల తట్టా, బుట్టా బయటకు విసిరేయడమే కాకుండా గర్భిణులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ లోపు సమాచారం అందుకున్న నేను అక్కడికి వెళ్లగా నాపైనా దాడి చేశారు. ఫిర్యాదులో గుండు శ్రవణ్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie