మంథని
మంథని మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షునిగా బిజెపి నాయకుడు పోతారవేణి క్రాంతికుమార్ ఇటీవల ఎన్నిక కాగా మంథని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గురువారం శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపి మంథని మత్స్యపారిశ్రామిక సహకార సంఘన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. మంథని బిజెపి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్, ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, నాంపల్లి రమేష్, కోరబోయిన మల్లికార్జున్, చిలువేరి సతీష్, టి. రాజు, పార్వతి విష్ణు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Prev Post
Next Post