విశాఖలో మందుబాబుకు మేజిస్ట్రేట్ కోర్టు వినూత్న శిక్ష
విశాఖపట్నం:మందుబాబుకు వినూత్న శిక్ష విధించింది విశాఖలోని మెట్రోపాలి టన్ మేజిస్ట్రేట్ కోర్టు ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 52 మంది మందు బాబులను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా వీరికి కోర్టు వినూత్న శిక్ష విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో అరెస్టు అయిన వారంతా కలిసి బీచ్లో ఉన్న వ్యర్థాలన్నీ ఏరివే యాలని కోర్టు ఆదేశించడంతో పోలీ సుల ఆధ్వర్యంలో మందుబాబులు బీచ్ క్లీన్ చేశారు.
దీంతో మందుబాబు లుకు కోర్ట్ గట్టి షాకిచ్చినట్లైంది.మందు బాబులకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గడిచిన మూడురోజుల్లో డంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన యాభై రెండు మంది మందు బాబులను బీచ్ ను శుభ్ర పరచాలని అన్యుహమైన తీర్పు వెలువరించడం ఇప్పుడు విశాఖలో అందరి దృష్టిని ఆకర్షించింది.