ఏలూరు
ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామికి చాత్మార్ ఉత్సవం శుక్రవారం రాత్రి క్షేత్ర పురవీధుల్లో నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తొళక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పా లంకరణ చేశారు. అనంతరం మూర్తులకు పూజాధికాలు నిర్వహించారు. ఆతరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ శ్రీవారు, అమ్మవారు కొలువైన వాహనాన్ని అట్టహాసంగా తిరువీధులకు తీసుకెళ్లారు. ప్రతీ ఇంటి ముందు భక్తులు శ్రీవారికి, అమ్మవార్లకు హారతులు పట్టారు.
శ్రీవారి ఆలయ ప్రాంగణములో యాత్రికుల రద్దీ స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో వెళ్తున్న భక్తులు..