పలమనేరు: యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ నేత లోకేష్ సోమవారం పలమనేరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. పలమనేరు నియోజకవర్గ ప్రజలు వినూత్నమైన రీతిలో క్రెన్ సహాయంతో300 కేజీల ఆపిల్ కాయలతో హారంతో స్వాగతం పలికారు. వీకోట మండలం అన్నవరం గ్రామంలోకి నారా లోకేశ్ పాదయాత్ర చేరుకుంది. పలమనేరు నియోజకవర్గం మండలంలోకి ప్రవేశించడంతో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా టిడిపి నాయకులు స్వాగతం పలికారు, మహిళలు అడుగడుగున హారతులతో స్వాగతం పలికారు