కాకినాడ:జగనన్న మా భవిష్యత్, మా నమ్మకం జగనన్న కార్యక్రమం ద్వారా కాకినాడ నగరంలో దాదాపు 90 వేల వెళ్ళి ప్రభుత్వం పై సర్వే చేయగా ప్రజలంతా చాలా సంతృప్తిగా ఉన్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. కాకినాడలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పధకాలను అందించడం జరిగిందని, దీంతో ప్రజాప్రతినిధులందరం ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నామని వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రి పద్మశ్రీ, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.