సంక్షిప్త వార్తలు:04-17-2025:కాంగ్రెస్ నిరసనలకు కౌంటర్ గా బీజేపి యువ మోర్చ ఆందోళనలకు దిగింది. ట్యాంక్ బండ్ అంబెద్కర్ విగ్రహం దగ్గర అందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేవైఎం నేతలను అడ్డుకున్నారు. బీజేపీ, ఈడి లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేవైఎం ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో తప్పులను కప్పిపుచ్చుకునేలా కాంగ్రెస్ తీరు అంటూ నినాదాలు చేసారు.
ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేవైఎం ఆందోళన
హైదరాబాద్
కాంగ్రెస్ నిరసనలకు కౌంటర్ గా బీజేపి యువ మోర్చ ఆందోళనలకు దిగింది. ట్యాంక్ బండ్ అంబెద్కర్ విగ్రహం దగ్గర అందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేవైఎం నేతలను అడ్డుకున్నారు. బీజేపీ, ఈడి లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేవైఎం ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో తప్పులను కప్పిపుచ్చుకునేలా కాంగ్రెస్ తీరు అంటూ నినాదాలు చేసారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెల్ల మహేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ తీరు దొంగే దొంగ అన్నట్లు ఉంది. ఈడిని కాంగ్రెస్ తప్పు పట్టడం బాధాకరం. రాజ్యాంగానికి కాంగ్రెస్ మోకరిల్లాల్సిసిందే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాద్రా ఆస్తులను జప్తు చేయాలని అన్నారు.
కూకట్ పల్లిలో కాంగ్రెస్ నిరసన
హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి ప్రభుత్వం వారి సొంత లాభాపేక్షకు వాడుతూ ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెడుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నేడు కూకట్ పల్లి నియోజకవర్గం వై జంక్షన్ వద్ద సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ హాజరై బిజెపి ప్రభుత్వంతోపాటు రంగ సంస్థ అయినా ఈ డి కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసిసి నేతలు రా హుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను ఈ డీ చార్జీషీట్ లో చేర్చడంతో తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపుమేరకు నేడు ఈడి ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో కూకట్ పల్లి కాంగ్రెస్ నేతలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిబిఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం తమ జేబు సంస్థ ల్లా వాడుకుంటోందని, కేవలం ప్రతిపక్షాల పై అక్రమ కేసులు పెట్టేందుకే ఈడీని బిజెపి ఉపయోగించుకుంటుందని బండి రమేష్ మండిపడ్డారు.సోనియా, రాహుల్గాంధీలపై ఈడీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఎవరు ఎన్ని చేసినా ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని వారికి త్వరలోనే బుద్ధి చెబుతారని వారు వ్యాఖ్యానించారు.
అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మంథని అగ్నిమాపక అధికారి శివశంకర వరప్రసాద్
మంథని
అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే అగ్ని మాపక కార్యాలయానికి ఈ నెంబర్ ద్వారా 87126 99204 సమాచారం ఇవ్వాలని మంథని అగ్నిమాపక అధికారి శివశంకర వరప్రసాద్ సుచించారు. అగ్ని మాపక వారోత్సవాల సందర్బంగా గురువారం మంథని పట్టణంలోని మాత శిశు ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి, రేనే ఆసుపత్రి లో సిబ్బందికి, చికిత్స పొందుతున్న పేషంట్లకి మంథని అగ్నిమాపక అధికారి శివశంకర వరప్రసాద్ అగ్ని ప్రమాదాలు జరిగినపుడు అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహనా కల్పించారు.
ఇందులో భాగంగా ఆసుపత్రిలలో అగ్ని మాపక నివారణ కరపత్రాలు పంచుతూ అగ్ని ప్రమాదాలు జరిగినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యాలపై తగు సూచనలు ఇచ్చారు. మంటలు ఎగిసిపాడుతున్న సమయంలో ఏలా అదుపు చేయాలో ప్రమాదల బారిన పడకుండా తమను తాము ఏలా రక్షించు కోవాలి అనే అంశాలపై పలు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మన్ దేవేందర్, ఫైర్ మన్ నరేందర్, ప్రశాంత్, డ్రైవర్ ఆపరేటర్ రమేష్, నాగరాజు పాల్గొన్నారు
జవహర్ నగర్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి సుడిగాలి పర్యటన
మేడ్చల్
ఈనెల 27న వరంగల్ లో జరగబోయే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు కదిలి రావాలని మాజీ మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు..గురువారం నాడు మల్లారెడ్డి బైక్ పై తిరుగుతూ పార్టీ వర్గాల్లో ఉషారు నింపారు. మాజీ మేయర్ మేకల కావ్య తో కలిసి ఇల్లిల్లూ తిరుగుతూ ప్రజలకు బొట్టు పెట్టి కరపత్రాలని పంచుతూ బహిరంగ సభకు ఆహ్వానించారు.
అనంతరం మాజీ మేయర్ మేకల కావ్య ఇంటిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాషవోని కొండల్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ లు, ఆలూరి సంగీత, మేక లలిత యాదవ్, మునిగాల సతీష్ , జిట్టా శ్రీవాణి జిల్లా నాయకులు ఆలూరి రాజశేఖర్ తో పాటు నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు.
మంథని తహసిల్దార్ గా కుమారస్వామి బాధ్యతల స్వీకరణ
మంథని తహసిల్దార్ గా బదిలీపై వచ్చిన జీ. కుమారస్వామి గురువారం మంథని తహసిల్దార్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. రామగుండం తహసిల్దార్ గా పనిచేస్తున్న కుమారస్వామి ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంథనికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో తహసిల్దార్ గా విధులు నిర్వహించిన రాజయ్య ను పెద్దపల్లికి బదిలీ చేయగా, పెద్దపల్లి తహసిల్దార్ రాజ్ కుమార్ ను మంథనికి కలెక్టర్ బదిలీ చేశారు. రాజ్ కుమార్ విధుల్లో చేరకపోవడంతో గత కొన్ని రోజులుగా మంథని నాయబ్ తహసిల్దార్ సిరిపురం గిరి ఇంచార్జ్ తహసిల్దారుగా బాధ్యతలు నిర్వహించారు. మంథని తహసిల్దారుగా బాధ్యతలు చేపట్టిన కుమారస్వామిని డిప్యూటీ తహసిల్దార్ సిరిపురం గిరి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అనిల్ రెడ్డి, సదయ్య ఇతర కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.