సంక్షిప్త వార్తలు:04-18-2025:ఉపాధి కూలీలు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి అడవి ప్రాంతంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలి గిట్టుబాటు కావడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ ఆరోపించారు. శుక్రవారం మంథని మండలం మైదుపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు అడవి ప్రాంతంలో చేస్తున్న పని ప్రదేశాన్ని ఆయన సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ మైదుపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు ఎర్రటి ఎండలో నాలుగు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి అడవి ప్రాంతంలో ఉపాధి పనులు చేస్తున్నారని వీరికి ట్రావెలింగ్ చార్జీలు ఇవ్వటం లేదని విమర్శించారు.
ఉపాధి కూలీలకు ట్రావలింగ్ చార్జీలు ఇవ్వాలి
నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి పనిచేసిన గిట్టుబాటు గాని కూలి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్
ఉపాధి కూలీలు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి అడవి ప్రాంతంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలి గిట్టుబాటు కావడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ ఆరోపించారు. శుక్రవారం మంథని మండలం మైదుపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు అడవి ప్రాంతంలో చేస్తున్న పని ప్రదేశాన్ని ఆయన సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ మైదుపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు ఎర్రటి ఎండలో నాలుగు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి అడవి ప్రాంతంలో ఉపాధి పనులు చేస్తున్నారని వీరికి ట్రావెలింగ్ చార్జీలు ఇవ్వటం లేదని విమర్శించారు.
ఇంత దూరం వచ్చి పనిచేసిన కూలి గిట్టుబాటు కావడం లేదని అన్నారు. పనిముట్లైన పార గడ్డపార తట్టలు కూలీలే కొనుకుంటున్నారని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని విమర్శించారు. నాలుగు కిలోమీటర్లు పోయి వచ్చే క్రమంలో ప్రమాదాలు జరుగుచున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పని ప్రదేశంలో కలిసే సౌకర్యాలు లేవని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఉపాధి కూలీలకు ట్రావెలింగ్ చార్జీలు ఇచ్చి రెండు నెలల కూలీల డబ్బులు విడుదల చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ల నాలుగు నెలల వేతనాలు ఇవ్వాలని పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు తూండ్ల కనకయ్య తమ్మిశెట్టి మల్లయ్య ఇసంపల్లి శ్రీనివాస్ పంతంగి లక్ష్మి పెట్టం పుష్ప తదితరులు పాల్గొన్నారు.
పంట నష్టం నివేదికలు అందించండి.
జయశంకర్ భూపాలపల్లి
అకాల వర్షాలకు దెబ్బ తిన్న వ్యవసాయ, వాణిజ్య పంటల నివేదిక అందచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ, ఉద్యాన అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల నివేదిక రూపకల్పనపై వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంట నష్టం అంచనాలు ప్రభుత్వ మార్గ దర్శకాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు. పంట నష్టం జరిగిన రైతులకు పరిహారం అందచేయుటకు ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరు నాయక్, జిల్లా ఉద్యాన అధికారి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన వన శాఖాధికారీగా సునీల్ కుమార్
జయశంకర్ భూపాలపల్లి
జిల్లా ఉద్యాన వన శాఖాధి కారిగా పూర్తి అదనపు బాధ్యత అప్పగిస్తూ సంచాలకులు యాస్మిన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు.అదనపు భాద్యతతో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు 317 ఉత్తర్వులు మేరకు నాగర్ కర్నూల్ జిల్లాకు బదిలీ అయ్యారు. వెంకటేశ్వర్లు బదిలీతో జిల్లా ఉద్యాన శాఖ అధికారి పోస్టు ఖాళీ అయిన సందర్భంగా హార్టీ కల్చర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎ సునీల్ కుమార్ కు జిల్లా ఉద్యాన వన శాఖాధి అధికారి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ సంచాలకుల ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఉద్యాన వన శాఖాధికారిగా నియమించబడిన సునీల్ కుమార్ గురువారం పదవి భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కు తన నియామకపు ఉత్తర్వులు ప్రతిని అందచేశారు.