సంక్షిప్త వార్తలు:04-18-2025:కరీంనగర్ జిల్లాలో కోతులు రెచ్చిపోతున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, ఎక్కడ చూసినా కోతుల బెడదతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కరీంనగర్ లోని మంకమ్మతోటలో వృద్దురాలుపై కోతులు దాడి చేశాయి. ఇంటిముందు నిల్చున్న వృద్ధురాలు ఆగమ్మ కొంగుపట్టి ఓ కోతి లాగగా మరో కోతి ఆమెపై దూకి కింద పడేశాయి. పదుల సంఖ్యలో కోతులు ఎగబడ్డాయి. వెంటనే స్థానికులు కర్రలు పట్టుకొని అరుస్తు బెదిరించడంతో కోతులు ఆమెను వదిలిపెట్టాయి. లేకుంటే వృద్ధురాలి ప్రాణం తీసేవి.
కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోతున్న కోతులు
మంకమ్మతోటలో వృద్ధురాలిపై దాడి చేసి కోతులు
కోతుల బెడదతో ఆందోళన చెందుతున్న ప్రజలు
కరీంనగర్
కరీంనగర్ జిల్లాలో కోతులు రెచ్చిపోతున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, ఎక్కడ చూసినా కోతుల బెడదతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కరీంనగర్ లోని మంకమ్మతోటలో వృద్దురాలుపై కోతులు దాడి చేశాయి. ఇంటిముందు నిల్చున్న వృద్ధురాలు ఆగమ్మ కొంగుపట్టి ఓ కోతి లాగగా మరో కోతి ఆమెపై దూకి కింద పడేశాయి. పదుల సంఖ్యలో కోతులు ఎగబడ్డాయి. వెంటనే స్థానికులు కర్రలు పట్టుకొని అరుస్తు బెదిరించడంతో కోతులు ఆమెను వదిలిపెట్టాయి. లేకుంటే వృద్ధురాలి ప్రాణం తీసేవి.
అటు సైదాపూర్ మండలం కేంద్రంలోని వెంకేపల్లి లో వానర సైన్యం దండు కట్టి ఘర్షణ పడ్డాయి. రెండు గ్రూపులుగా విడిపోయిన కోతులు పరస్పరం ఘర్షణ పడి గ్రామస్తులను భయాందోళనకు గురిచేశాయి. దారిలోనే కిష్కిందకాండల వానర సైన్యం ఘర్షణ పడడంతో దాదాపు రెండు గంటల పాటు రాకపోక నిలిచిపోయాయి. కోతుల బెడదతో వేగలేక పోతున్నామని, అధికారులు కోతులు నివారించే చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు.
ఎస్సీ హాస్టల్ విద్యార్దుల అందోలన
కల్వకుర్తి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మోడల్ కాలేజ్ ఎస్సీ హాస్టల్ లో విద్యార్థుల నిరసనకు దిగారు, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని హాస్టల్ విద్యార్థులు హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు. హాస్టల్ లో పనిచేస్తున్న వర్కర్ శ్రీశైలం విద్యార్థుల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతాడని శ్రీశైలం ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు ధర్నాకు దిగారు. హాస్టల్ వార్డెన్ కూడా సమయపాలన పాటించకపోవడంతో వర్కర్ల పనితీరు ఘోరంగా మారిందని ఇప్పటికైనా అధికారులు స్పందించి మెనూ ప్రకారం భోజనం అందేటట్లు చూడాలని విద్యార్థులు కోరారు.
అందుబాటులోకి తార్నాక జంక్షన్
తార్నాక
గత 8 సంవత్సరాలుగా మూసి ఉన్న తార్నాక జంక్షన్ మళ్లీ వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది.తార్నాక జంక్షన్ సిగ్నల్ ను ట్రాఫిక్ సిటీ పోలీసులు రీ ఓపెన్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లాలాపేట్ వైపు వాహనాలు నేరుగా రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఏప్రిల్ 18 (నేటి) నుంచి మే 2 వరకు ట్రయల్ రన్ ను నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు నిర్వహించనున్నారు..
ఆర్ ఎస్ బ్రదర్స్ షో రూమ్ ను ప్రారంభించిన ఎంపి, ఎమ్మెల్యే
విజయవాడ
విజయవాడ బీసెంట్ రోడ్ లో నూతనం గా ఏర్పాటు చేసిన ఆర్. ఎస్ బ్రదర్స్ షో రూమ్ ప్రారంభోత్సవం జరిగింది. *ఆర్. ఎస్ బ్రదర్స్ షో రూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసారు. ఎంపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారస్తులకు అండగా ఉంటుంది వ్యాపారాలు బాగా జరిగితే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. *ఆర్. ఎస్ బ్రదర్స్ షో రూమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ లో హిదువుల పై దాడులు అమానుషం
బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్
హైదరాబాద్
పశ్చిమ బెంగాల్ లో హిందువుల పై దాడులు అమానుషమని, కావాలనే కొందరు ముష్కర మూకలు నిరసన పేరుతో హిదువుల పై దాడులు చేసి చంపడం సరైనది కాదని నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డిలు అన్నారు. శుక్రవారం సైదాబాద్ ప్రధాన రహదారి పై బిజెపి ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టారు. వందలాది మంది కార్యకర్తలు వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నీ మమత బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం నిరంజన్ యాదవ్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. దాడుల వెనుక ఉన్న ఉగ్రవాదుల హస్తం బయట పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సుభాష్ చందర్ జీ , సహదేవ్ యాదవ్,శ్రీకాంత్ రెడ్డి,వీరెందర్ యాదవ్,కొత్త కాపు రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, దశరథ లక్ష్మి, రమణ సింగ్,నవీన్, దినేష్ గోలికర్, ఆశిష్ గోలికర్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు..