సంక్షిప్త వార్తలు:04-19-2025

brife news

సంక్షిప్త వార్తలు:04-19-2025:జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు రసాబాసాగా మారింది.  మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మాజీ జెడ్పీ చైర్మన్ సరిత  లను స్టేజి మీదకు పిలవలేదని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి కిందనే కూర్చుని నిరసన వ్యక్తం చేసారు.   మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలోనే  పోలీసులు, సరిత వర్గీయుల మధ్య వాగ్వివాదం జరిగింది. ..

దరూర్ లో భూ భారతి సదస్సు లో వాగ్వాదం

జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు రసాబాసాగా మారింది.  మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మాజీ జెడ్పీ చైర్మన్ సరిత  లను స్టేజి మీదకు పిలవలేదని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి కిందనే కూర్చుని నిరసన వ్యక్తం చేసారు.   మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలోనే  పోలీసులు, సరిత వర్గీయుల మధ్య వాగ్వివాదం జరిగింది.

వక్ఫ్ బిల్లు మంచా చెడా అనేది ముస్లింలందరూ ఆలోచన చేయాలి
ఎంఐఎం సభ పై రాజాసింగ్

వక్ఫ్ బిల్లు ముస్లిం సమాజానికి మేలు చేస్తుందా ? | The Waqf Bill Debate:  Reforms, Controversies, and Impact
హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టంపై ఎంపి అసదుద్దిన్  ఓవైసీ సభ పెడుతున్నాడు. ఓవైసీ ఈ సభలోనైనా నిజం చెప్పే ప్రయత్నం చెయ్. నిజం చెప్పడానికి నీవు ఒప్పుకోవని అయన అన్నారు. ఎందుకంటే వక్ఫ్ భూములను కబ్జా చేసింది అమ్ముకున్నది, తక్కువ ధరకు లీజుకు ఇచ్చింది మీరే. వాటిని అమ్ముకున్నప్పుడు మీకు అవి అల్లా భూములని గుర్తు రాలేదా..? ముస్లింల్లారా ఓవైసీ మాటలను నమ్మకండి.. నమ్మితే మీరే నష్టపోతారు. వక్ఫ్ చట్టం వలన పేద ముస్లింలకు మంచి జరుగుతుంది. మీరు ఎన్ని చేసిన వక్ఫ్ చట్టం పైన కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. పార్లమెంట్లో వక్ఫ్ చట్టం పైన మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. కానీ ఓవైసీ కి మాట్లాడే దమ్ము లేక మీడియాలో హైలైట్ కావాలని చట్టాన్ని చించి వచ్చారు. వక్ఫ్ బిల్లు మంచా చెడా అనేది ముస్లింలందరూ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.

ఘనంగా బీజేపీ నేత వడ్డేపల్లి జన్మదిన వేడుకలు

Vaddepally Rajeshwar Rao | BJP State Executive Member | Telangana | BJP
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు జన్మదిన వేడుకలు కూకట్పల్లి  వివేకానంద నగర్ లోని ఆయన నివాసం వద్ద ఘనంగా జరిగాయి.మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని కేక్ కట్ చేసి వడ్డేపల్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు,పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు.కూకట్పల్లి ప్రాంతంలో నిత్యం ప్రజా సమస్యలు వెలికితీస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న స్తానిక జర్నలిస్టుల  సంక్షేమానికి కోటి రూపాయల సహాయాన్ని  అందజేశారు.ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ కూకట్పల్లి నియోజక వర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు బాగా పెరిగిందని,రాబోయే రోజుల్లో ఇక్కడ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.పేద ప్రజలకు అండగా ఉంటూ నిత్యం పేదల కోసం పాటుపడే పార్టీ బిజెపి అన్నారు.ఈరోజు ఎంతో మంది పేదలు అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం వడ్డేపల్లి రాజు జన్మదినం సందర్భంగా రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు.

Related posts

Leave a Comment