సంక్షిప్త వార్తలు:04-20-2025

brife news

సంక్షిప్త వార్తలు:04-20-2025:కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ సీనియ‌ర్ లీడ‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ వాల్ రైటింగ్స్‌ను చెరిపేయ‌డంపై ఆర్ఎస్పీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి సూచ‌న మేర‌కు మున్సిప‌ల్ అధికారులు వాల్ రైటింగ్స్‌ను చెరిపేయ‌డం స‌రికాద‌న్నారు.

కాంగీ కాకుల్లారా.. మీరెన్ని కుట్రలు చేసినా వరంగల్లోసభ జరుగుతుంది

హైద‌రాబాద్ ఏప్రిల్ 19
కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ సీనియ‌ర్ లీడ‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ వాల్ రైటింగ్స్‌ను చెరిపేయ‌డంపై ఆర్ఎస్పీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి సూచ‌న మేర‌కు మున్సిప‌ల్ అధికారులు వాల్ రైటింగ్స్‌ను చెరిపేయ‌డం స‌రికాద‌న్నారు.

అధికారుల అత్యుత్సాహంపై ఆర్ఎస్పీ మండిప‌డ్డారు.కాంగీ కాకుల్లారా.. మీరెన్ని కుట్రలు చేసినా, ఏప్రిల్ 27న మొత్తం తెలంగాణ వరంగల్లో ఉండబోతున్నది. ఆ రోజు మిగిలేది కేవలం రేవంత్ రెడ్డి ఆయన అసిస్టెంట్లు మాత్రమే. గాంధీ భవన్‌లో మా సభ లైవ్ చూస్తూ చక్కగా కాలక్షేపం చేసుకోండి అని ఆర్ఎస్పీ కాంగ్రెస్ నేత‌ల‌కు సూచించారు.

జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 ఫలితాలు విడుదల
  నలుగురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్‌

JEE Main Results | జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు.. నలుగురు తెలుగు విద్యార్థులకు  100 పర్సంటైల్‌-Namasthe Telangana

న్యూ డిల్లీ ఏప్రిల్ 19
జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ శుక్రవారం రాత్రి ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్‌ కీని విడుదల చేసిన అధికారులు.. ఆ తర్వాత విద్యార్థులు సాధించిన పర్సంటైల్‌ స్కోర్‌తో ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 2, 3, 4, 7, 8 తేదీల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.ఇందులో 24 మంది విద్యార్థులు 100కి వంద పర్సంటైల్‌ సాధించారు.

రాజస్థాన్‌కు చెందిన మహ్మద్‌ అనాస్‌ ఫస్ట్‌ ర్యాంకు, ఆయుష్‌ సింఘాల్‌ రెండో ర్యాంక్‌ సాధించారు. వంద పర్సంటైల్‌ సాధించిన వారిలో తెలంగాణకు చెందిన హర్ష ఏ గుప్తా, వంగల అజయ్‌రెడ్డి, బనిబ్రత మజీ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి సాయిమనోజ్ఞ ఉన్నారు. హర్ష ఏ గుప్తా దేశవ్యాప్తంగా ఎనిమిదో ర్యాంక్‌ని సాధించగా.. అజయ్‌రెడ్డికి ఆలిండియా 16వ ర్యాంకుతో పాటు ఈడబ్ల్యూస్‌ కేటగిరిలో ఒకటో ర్యాంక్‌లో నిలిచాయి. సాయిమనోజ్ఞకు ఆలిండియా 22వ ర్యాంక్‌, బాలికల్లో రెండో ర్యాంక్‌ సాధించింది. బనిబత్ర మజీ ఆల్‌ఇండియా 24వ ర్యాంకు సాధించింది.

Related posts

Leave a Comment