సంక్షిప్త వార్తలు:04-22-2025:మండలంలోని ఉదయం 9 గంటల నుంచి భీభత్సమైన ఎండలు కాస్తుండడంతో మండల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వడగల్లు వర్షం బీభత్సం గా రావడంతో మండల ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. వడగళ్ల వర్షం ఉరుములు మెరుపులతో సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురవడంతో పలు ప్రాంత రహదారులు జలమయమయ్యాయి.
వడగళ్ల వర్షం బీభత్సం..
డుంబ్రిగుడ ఏప్రిల్ 22
మండలంలోని ఉదయం 9 గంటల నుంచి భీభత్సమైన ఎండలు కాస్తుండడంతో మండల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వడగల్లు వర్షం బీభత్సం గా రావడంతో మండల ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. వడగళ్ల వర్షం ఉరుములు మెరుపులతో సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురవడంతో పలు ప్రాంత రహదారులు జలమయమయ్యాయి.
ముడురాళ్ళపల్లె లో శ్రీదేవి , భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి కళ్యాణం రమణీయం – కమనీయం..
నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండలం ముడురాళ్ళపల్లే గ్రామంలో పూజారి వెళ్ళాల సంపత్ కుమార్ శర్మ వేదమంత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు.ప్రతి నెల శ్రవణా నక్షత్రం సంధర్భంగా ఆలయములో కల్యాణం అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహిస్తున్నామని ఆలయ పెద్దలు తెలిపారు.అనంతరం దేవాలయము చుట్టూ పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు.
భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఆలయ పెద్దల ఆధ్వర్యములో ఉభయదారులకు శాలువ కప్పి పూల దండ వేసి సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ దాతలు పులి చిన్న ఓబుల్ రెడ్డి ధర్మపత్ని పద్మావతి , ఉభయదాతలు రేనాటి బాలీశ్వర్ రెడ్డి ధర్మపత్ని ప్రభావతి , సింగా తనూజ , సింగా నాగేశ్వర్ రెడ్డి , నాయకంటి నందిని రెడ్డి , నాయకంటి మస్తాన్ రెడ్డి , ఆలయ పెద్దలు , గ్రామ భక్తులు , మహిళలు , తదితరులు పాల్గొన్నారు
వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా బుధవారం భారీ ర్యాలీ
ఆళ్లగడ్డలో బుధవారం వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా జరగబోయే భారీ ర్యాలీకి సిరివెళ్ల మండల కేంద్రం నుండి భారీగా తరలి వెళ్లడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సిరివెళ్ల మండల కన్వీనర్ తబా జమాల్ బాషా, ఇబ్రహీం లు తెలియజేశారు. సిరివెళ్ల మండల కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లిం లకు చెందవలసిన వక్ఫ్ బోర్డు బిల్లును సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లును ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సెక్యులర్ వాదులు వ్యతిరేకించవలసిన అవసరం ఉందని అన్నారు. రేపు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే భారీ ర్యాలీకి సిరివెళ్ల మండలం నుండి తండోపతండాలుగా ముస్లిం సోదరులందరూ పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు ముస్లింలు పాల్గొన్నారు