సంక్షిప్త వార్తలు:04-22-2025:కళాశాల క్యాంపస్ లో ఫోన్ కాల్స్ మాట్లాడవద్దంటూ సెల్ ఫోన్ ను తీసుకున్న అధ్యాపకురాలిపై ఓ విద్యార్థిని చెప్పుతో దాడికి పాల్పడింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని ఓ ప్రైవెట్ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో జరిగిన ఈ ఘటన…సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఫోన్ లో మాట్లాడుతుండగా..ఎన్సీసీకి చెందిన అధ్యాపకురాలు ఫోన్ లాక్కున్నారు.
లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్దిని
విశాఖపట్నం
కళాశాల క్యాంపస్ లో ఫోన్ కాల్స్ మాట్లాడవద్దంటూ సెల్ ఫోన్ ను తీసుకున్న అధ్యాపకురాలిపై ఓ విద్యార్థిని చెప్పుతో దాడికి పాల్పడింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని ఓ ప్రైవెట్ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో జరిగిన ఈ ఘటన…సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఫోన్ లో మాట్లాడుతుండగా..ఎన్సీసీకి చెందిన అధ్యాపకురాలు ఫోన్ లాక్కున్నారు. ఆగ్రహించిన విద్యార్థిని 12వేల విలువైన సెల్ ఫోన్ తీసుకుంటావా అంటూ తిట్ల దండకం ప్రారంభించింది. చెప్పు తీసి కొడతానంటూ కేకలు వేసింది. ఆ తర్వాత అనుకున్నంత పని చేయడంతో..అక్కడున్న విద్యార్థులు, సిబ్బంది అవాక్కయ్యారు
వాహనాల రికవరీలో విశాఖ పోలీసుల రికార్డ్
విశాఖపట్నం
వాహనాల రికవరీలో విశాఖ పోలీసులు రికార్డు సృష్టించారు.నిర్వహించిన వాహనచ మెళా ద్వారా యాజమానులకు వాహనాలను అందించినట్లుగా సీపీ శంఖబ్రాత బాగ్చి తెలిపారు.పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు పలు పోలీస్ స్టేషన్లలో నిరుపయోగంగా మారుతున్నాయని,ఇలాంటి మెళాల ద్వారా వాహనాలను యాజమానులకు అందిస్తున్నామని తెలిపారు.
గుర్తింపు పొందిన పాఠశాలల్లోనే పిల్లలను చేర్చాలి
మండల విద్యా శాఖ అధికారి సురేందర్ కుమార్
ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో తల్లితండ్రులు తమ పిల్లలను చేర్చాలని పెద్దపల్లి మండల విద్యా శాఖ అధికారి పి.సురేందర్ కుమార్ మంగళవారం తెలిపారు.మండలంలోని లిటిల్ క్రియేషన్స్, బచ్ పన్ , లక్ష పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరంలోకి ఎలాంటి అనుమతులు లేవని, తల్లిదండ్రులు విద్యార్థులను ఆ పాఠశాలలో చేర్పించవద్దని, ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఒకవేళ ప్రైవేటు పాఠశాలలో చేర్పించాలనుకుంటే ప్రభుత్వ ఆమోదం పొందిన పాఠశాలలో మాత్రమే చేర్పించాలని, గుర్తింపు నిర్ధారణ అనంతరం పాఠశాలల్లో విద్యార్థులను చేర్చాలని ఆయన సూచించారు.
నర్సంపేటలో కాషాయ జెండా ఎగుర వేయాలి
నర్సంపేట
వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగుర వేయాలని పట్టణ సంచార ప్రభారి రంజిత్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చాడు.భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మంగళవారం జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆదేశానుసారం నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అధ్యక్షతన పూర్తిస్థాయి పట్టణ కమిటీ వేయడానికి ముఖ్య అతిధిగా పట్టణ సంచార ప్రభారిగా దుంకదువ్వ రంజిత్ హాజరైనారు. అనంతరం రంజిత్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ సామాన్య కార్యకర్తలు నాయకులుగా ప్రజా ప్రతినిధులుగా చేసేటటువంటి పార్టీ అని పార్టీలో కష్టపడితే ఉన్నతమైన స్థానాలకు చేరచ్చని అన్నారు.
పార్టీ కోసం పనిచేసి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నర్సంపేటలో కాషాయ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త అహర్నిశలు కష్టపడి పార్టీ కోసం పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిల్ల రామ్ చందర్,మాజీ కౌన్సిలర్ గోల్యా నాయక్, సీనియర్ నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్, శీలం సత్యనారాయణ గౌడ్, జిల్లా మహిళా నాయకురాలు సూత్రపు సరిత పట్టణ మహిళా మోర్చా నాయకురాలు మార్త సంధ్యారాణి, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, ఉపాధ్యక్షులు కొంకీసా విగ్నేష్ గౌడ్, పట్టణ బిజెపి నాయకులు కందికొండ శ్రీనివాస్,పొనుగోటి రవింద్ర చారి, ఠాకూర్ విజయ్ సింగ్, కందగట్ల నాగరాజు, థౌటం నిశాంత్, ఠాకూర్ శివాంజన్ సింగ్, వల్లజీ నరేందర్, చేను నరేష్, కాసుల నాగేంద్రబాబు, ముత్యాల శ్రీనివాస్,చిలుక కుమార్, కందికొండ ప్రభాకర్,సామల ప్రవీణ్ కుమార్, తాటికాంటి రవికుమార్,బసికే శోభన్,యువ మోర్చా జిల్లా కార్యదర్శి చిలువేరు అన్వేష్, తప్పెట్ల సతీష్, రాజేష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.