సంక్షిప్త వార్తలు:04-25-2025

brief news

సంక్షిప్త వార్తలు:04-25-2025:విధి వక్రీకరించి కన్న బిడ్డలకు తండ్రులే… తల కొరివి పెట్టిన గుండెల్ని పిండి వేసేటువంటి ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం దుర్గారం గ్రామానికి చెందిన జంగా సంపత్, జంగా ఎల్లయ్యలు ఇద్దరు అన్నదమ్ములు. వీరికి మౌనిక, నవ్య ఇద్దరు కుమార్తెలు. బుధవారం పెగడపల్లి శివారులో రాత్రి  ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మౌనిక, నవ్య మృతిచెందారు.

కూతుళ్లకు తలకొరివి పెట్టిన తల్లిదండ్రులు

మహబూబాబాద్
విధి వక్రీకరించి కన్న బిడ్డలకు తండ్రులే.. తల కొరివి పెట్టిన గుండెల్ని పిండి వేసేటువంటి ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం దుర్గారం గ్రామానికి చెందిన జంగా సంపత్, జంగా ఎల్లయ్యలు ఇద్దరు అన్నదమ్ములు. వీరికి మౌనిక, నవ్య ఇద్దరు కుమార్తెలు. బుధవారం పెగడపల్లి శివారులో రాత్రి  ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మౌనిక, నవ్య మృతిచెందారు. దీంతో ఆ కుటుంబంలో ఒకేసారి ఇద్దరు మృత్యువాత పడడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అల్లుకున్నాయి.

తల్లిదండ్రులమగు మేము కూతురు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి అత్తవారింటికి పంపే చేతులు నేడు,  మా పిల్లలకు తలకొరివి పెట్టవలసిన దుస్థితి ఏర్పడిందని ఇద్దరు అన్నదమ్ములు బోరున వినిపిస్తుంటే దాహన సంస్కారాలకు హాజరైన కుటుంబ సభ్యులు గ్రామస్తులు బోరున విలపించారు. మౌనిక నవ్య శవయాత్రలలో గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చారు. చితులు కూడ పక్క పక్కనే పేర్చి చివరి వరకు కూడ తోడుగానే ఉండాలని నిప్పంటించేంతవరకు బంధువులు గ్రామస్థులు ఉండి వారికీ చివరి వీడ్కోలు పలికారు.

ఆపరేషన్ కగార్ లో పైచేయి సాధిస్తున్న బలగాలు

Operation Kagar : ఆపరేషన్ కగార్...100 మంది మహిళా మావోయిస్టులు హతం

ములుగు
చత్తీస్గడ్ లోని బీజాపూర్ అటవీ ప్రాంతంపై భద్రతా దళాలు పట్టు సాధిస్తున్నాయి. రెండు రోజులుగా పూజారికాంకేర్ అటవీ ప్రాంతంలో  ఎదురు కాల్పులు కొనసాగాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో నలుగురు మహిళా మావోయిస్టులను గుర్తించారు. మృతులంతా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాకు చెందిన గెరిల్లా దళ సభ్యులు. మావోయిస్టు డంపులను స్వాదీనం చేసుకుంటూ ముందుకు బలగాలు కదులుతున్నాయి. కర్రెగుట్టల్లో సాయుధ బలగాలు నూతనంగా మూడు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. మరోవైపు వెంకటాపురం వైపు కూంబింగ్ కు ఎండ తీవ్రత అడ్డంకిగా మారింది. ఎండల తీవ్రతకు నిన్నటి వరకు 21మంది జవాన్లు  అస్వస్థతకు గురయ్యారు. 15మందికి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హెలికాప్టర్ లో వెంకటాపురం ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కర్రెగుట్టలను పూర్తిగా స్వాదీనం చేసుకునే వరకు  ఆపరేషన్ కొనసాగునుంది.

కఠిన చర్యలు తీసుకోవాలి

Minister Uttam: అందుకే కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం | Minister Uttam Kumar Reddy KEY Comments on Krishna River water disputes VK

హైదరాబాద్
దేశంలో అలజడులు సృష్టించేందుకు పన్నిన కుట్ర ఇది..ఈ సంఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు సంఘటితమయ్యాయి.కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రభుత్వం తీసుకునే చర్యలను సమర్థిస్తూ తీర్మానం చేసింది. హిందూ ముస్లింల మత సామరస్యాన్ని దెబ్బతియ్యడంతో పాటు కాశ్మీర్ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు జరిపిన ఈ దాడిని దేశ ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారని అయన అన్నారు.

Related posts

Leave a Comment