సంక్షిప్త వార్తలు:04-25-2025:మలేరియా నియంత్రణ మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ర్యాలీలో పాల్గొన్న వారితో మలేరియా నియంత్రణ ప్రతిజ్క్ష చేయించారు.
మలేరియా దినోత్సవ ర్యాలీ
పాల్గోన్న జిల్లా కలెక్టర్
ఒంగోలు
మలేరియా నియంత్రణ మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ర్యాలీలో పాల్గొన్న వారితో మలేరియా నియంత్రణ ప్రతిజ్క్ష చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ, ప్రతిఏటా ఏప్రిల్ 25వ తేదీన మలేరియా నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఈ ఏడాది మలేరియా నివారణ మనందరి బాధ్యత అన్న నినాదంతో జరుపుతున్నామన్నారు. మలేరియా వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. మలేరియా వ్యాధి నిర్దారణ, సకాలంలో చికిత్స వంటి వాటితో నియంత్రించవచ్చన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా నిర్దారణ సౌకర్యాలు, చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయన్నారు.
చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్
విశాఖపట్నం
పహల్గాంలో ఉగ్రవాద దుశ్చర్యలో మృతిచెందిన విశాఖ వాసి చంద్రమౌళి కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు. ముందుగా జిల్లా పరిషత్ జంక్షన్ దగ్గరున్న కనకదుర్గ ఆస్పత్రిలో చంద్రమౌళి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి పాండురంగాపురంలో ఉన్న చంద్రమౌళి నివాసానికి వెళ్లి ఆయన భార్య నాగమణి, కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కూలీలపై దూసుకుపోయిన కారు..పలువురికి గాయాలు
జగ్గయ్యపేట
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఒక కారు ప్రమాదం సంభవించింది. స్థానిక చెరువు బజార్ లో రోడ్డు పక్కన నిలబడిన కూలీలపైకి ఓ కారు దూసుకువెళ్లింది. దీంతో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. కొంతమంది వ్యక్తులు రోడ్డు పక్కనే ఉన్న గోడ వద్ద నిలబడి మాట్లాడుకోవడం కనిపిస్తోంది. కొందరు ద్విచక్ర వాహనంపై కూర్చుని ఉండగా మరికొందరు వారి పక్కనే నిలబడి ఉన్నారు. ఇంతలో ఒక కారు వేగంగా దూసుకురావడం గమనించి వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కారు వారిని ఢీ కొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు సాయం చేశారు. కొంతమంది ఆగ్రహంతో కారు డ్రైవర్ ను చితకబాదారు.
ఓవైసీ నిరసన
హైదరాబాద్
పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.ప్రార్థనలకు ముందు శాస్త్రిపురంలోని మసీదు వద్ద ఆయన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చార్మినార్, మక్కామసీదు పరిసర ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రార్థనల కోసం మసీదుకు వచ్చిన వారికి అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా నల్ల బ్యాడ్జీలను పంపిణీ చేశారు.
తాను కూడా చేతికి నల్ల బ్యాడ్జీ ధరించారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించాలని ఆయన అక్కడి వారికి పిలుపునిచ్చారు. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైకాపాకు 175/0
ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హాట్ కామెంట్స్
కడప
పాకిస్థాన్ పైన తీవ్రమైన చర్య ఉంటుంది. ప్రపంచం మొత్తం మనకు మద్దతు ఇస్తోంది. ఆర్టికల్ 370 రద్దు అయినప్పటి నుంచి మూడు కోట్లకు పైగా కాశ్మీర్లో పర్యాటకులు సందర్శించారు. అమరావతి, పోలవరం, విశాఖ రైల్వే జోన్, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ వంటి వాటికి భాజాపా పూర్తి మద్దతు ఇస్తోంది. 22 కోట్ల జనాభా ఉన్న పాకిస్థాన్ అంత ఉంటే 140 కోట్లు ఉన్న మనం ఏంటో మన యంత్రాంగం, ఆర్మీ శక్తి, ప్రధాని మోడీ అంటే ఏందో పాకిస్థాన్ కు తెలుస్తుందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం తరుపున మిలటరీకి పెద్దమొత్తంలో ఆర్థికంగా సహాయం అందించబోతున్నాం. అత్యంత త్వరలోనే సూపర్ సిక్స్ పథకాలు అమలౌతాయి.
కొన్ని పత్రికలు ఆఫ్ ది రికార్డ్ అంటూ బాబాయ్ అబ్బాయ్ అంటూ అసత్య కథనాలు ప్రచురించి ప్రజల్లోకి తప్పుడు సందేశం ఇస్తున్నాయని వారికి సవాల్ విసురుతున్నా ఆఫ్ ది రికార్డ్ కాదు ఆన్ రికార్డ్ చర్చకు రావాలన్నారు. భాజపా జగన్ వెంట్రుక ఏమీ పీకదు ఏకంగా గుండు కొట్టి రాజకీయాల నుంచి లేకుండా చేస్తాం వైసీపీకి వేరుపురుగు పట్టిందని త్వరలోనే కూలిపోతుంది అన్నారు. దేశంలోని 4123 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి నాలుగు స్థానాల్లో జమ్మలమడుగు ఉంటుందన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ సహకారంతో కేవలం పది నెలల్లోనే రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నిలబెట్టారన్నారు. లిక్కర్, ఇసుక, కాంట్రాక్ట్, ఎలక్ట్రికల్, చివరికి నీళ్ళు మొదలుకొని ప్రతీదాట్లో జగన్ దొంగతనం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175/0 అన్నారు.