సంక్షిప్త వార్తలు:04-25-2025:పాకిస్థానీయులను వెనక్కి పంపాలపి రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎం లకు అమిత్ షా ఫోన్ చేసారు. కాగా హైదరాబాద్లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్లో 200 మందికి పైగా పాకిస్థానీయులు వాళ్ళను వెనక్కి పంపాలి
రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు
హైదరాబాద్
పాకిస్థానీయులను వెనక్కి పంపాలపి రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎం లకు అమిత్ షా ఫోన్ చేసారు. కాగా హైదరాబాద్లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
జనసేన మానవహారం
విజయవాడ
పహల్గాం ఉగ్ర దాడిని నిరసిస్తూ, ఆ దాడిలో మృతులకి సంతాప సూచకంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఉదయం విజయవాడలో మానవ హారం కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పార్టీ నేతలు సామినేని ఉదయ భాను, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, అక్కల గాంధీ, రావి సౌజన్య, మల్లెపు విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కూంబింగ్ ఆపండి
మావోయిస్టుల లేఖ
బీజాపూర్
తెలంగాణ చత్తీస్-ఘడ్ సరిహద్దు అటవీప్రాంతంలో జరుగుతున్న భద్రత బలగాల కూంబింగ్ ను ఆపాలని మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. శాంతి చర్చలకోసం ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని మావోయిస్టు పార్టీ లేఖ ద్వారా కోరింది. ప్రస్తుతం జరుగుతున్న భద్రత బలగాల దాడులను ఆపాలని విజ్ఞప్తి చేసింది.
నార్త్,వెస్ట్ బస్తర్ బ్యూరో రూపేష్ పేరుతో ప్రెస్ నోట్ ద్వారా మావోయిస్టు పార్టీ అప్పీల్ చేసింది. .
భద్రాద్రి ఆలయంలో సిబ్బంది నిరసన
భద్రాచలం
కాశ్మీర్ పహల్గావ్ ఉగ్రవాదుల మారణకాండకు భద్రాద్రి దేవస్థానం పరిపాలన మరియు వైదిక సిబ్బంది నిరసన వ్యక్తం చేసి సంతాపం తెలిపారు. ఆలయ సీఆర్వో కార్యాలయం వద్ద నిరసన తెలుపుతూ హిందూ ధర్మం వర్ధిల్లాలి, ప్రపంచం సుభిక్షంగా ఉండాలంటూ ఆలయ సిబ్బంది నినాదాలు చేసారు. ఉగ్ర దాడిపట్ల శనివారం ఆలయంలో అర్చక బృందం శాంతి పూజలు నిర్వహించనుంది.
చిన్నారి సాత్విక కుటుంబానికి హరీష్ రావు చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేత
సిద్దిపేట
ఈ నెల 19న విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో తన తండ్రి చనిపోయిన తల్లి కష్టపడి చదివిస్తుందని సాత్విక కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే. చిన్నారి మాటలకు స్టేజిపైనే హరీష్ రావు కన్నీరు పెట్టుకున్నారు. అండగా ఉంటానని అయన భరోసా ఇచ్చారు. పిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చిన్నారిని హరీష్ రావు కలిసారు. చిన్నారి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని వ్యాపారవేత్త తిరుమల్ రెడ్డి అందించారు. హరీష్ రావు చేతుల మీదుగా చెక్కును చిన్నారి సాత్విక తల్లికి అందజేసారు.