Andhra Pradesh:కేశినేని బ్రదర్స్ మధ్య గొడవ ముదురుతోంది. విశాఖలో ఉర్సా కంపెనీకి భూముల కేటాయింపు నేపథ్యంలో విజయవాడ మాజీ ఎంపీ అయిన కేశినేని నాని.. ప్రస్తుత ఎంపీ, సోదరుడు అయిన కేశినేని చిన్నిపై ఇటీవల ఆరోపణలు చేశారు. జవాడ బ్రదర్స్ కేశినేని నాని, కేశినేని చిన్నిల మధ్య యుద్ధం పీక్ కు చేరుకుంది. గత రెండు రోజులుగా కేశినేని నాని చేస్తున్న ఆరోపణలపై ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినాని చిన్ని స్పందించారు.
అన్నదమ్ముల మధ్య 100 కోట్ల దావా
విజయవాడ, ఏప్రిల్ 26
కేశినేని బ్రదర్స్ మధ్య గొడవ ముదురుతోంది. విశాఖలో ఉర్సా కంపెనీకి భూముల కేటాయింపు నేపథ్యంలో విజయవాడ మాజీ ఎంపీ అయిన కేశినేని నాని.. ప్రస్తుత ఎంపీ, సోదరుడు అయిన కేశినేని చిన్నిపై ఇటీవల ఆరోపణలు చేశారు. జవాడ బ్రదర్స్ కేశినేని నాని, కేశినేని చిన్నిల మధ్య యుద్ధం పీక్ కు చేరుకుంది. గత రెండు రోజులుగా కేశినేని నాని చేస్తున్న ఆరోపణలపై ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినాని చిన్ని స్పందించారు. వంద కోట్ల రూపాయల పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపారు. అయితే లీగల్ నోటీసులకు కేశినేని నాని స్పందించారు. తాను పది సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశానని, జవాబుదారీతనం పారదర్శక,సమగ్రతతో పనిచేశానని చెప్పారు. తాను చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్న కేశినేని నాని తాను మౌనంగా ఉండబోనని, అక్రమాలపై ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పకుండాబెదిరింపులకు దిగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కేశినేని నాని లేఖ కూడా రాశారు.
ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు.. విదేశీ కంపెనీలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేశినేని చిన్ని (కేశినేని శివనాథ్) మండిపడ్డారు. పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంతో విషం చిమ్ముతున్నారంటూ విమర్శించారు. ఈ క్రమంలోనే కేశినేని నానిపై కేశినేని చిన్ని వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ లీగల్ నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని పరువు నష్టం దావాపై కేశినేని నాని స్పందించారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.కేశినేని చిన్ని పంపించిన లీగల్ నోటీసుపై కేశినేని నాని సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇచ్చారు. రూ. 100 కోట్లు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం అగదని కేశినేని నాని స్పష్టం చేశారు. విజయవాడ ప్రజలు తనకు పదేళ్లు ఎంపీగా పనిచేసే అవకాశం ఉచ్చారని.. అలాంటి ప్రజల పట్ల తాను జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయతీతో ఉంటానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖలోని ప్రతీ మాటకు తాను కట్టుబడి ఉన్నట్లు కేశినేని నాని స్పష్టం చేశారు.
కేశినేని చిన్ని తనకు పంపించింది కేవలం లీగల్ నోటీసు మాత్రమే కాదని.. విమర్శలను బెదిరించడానికి , మౌనంగా ఉంచడానికి, నోరు మూయించడానికి చేస్తున్న ప్రయత్నమని ఆరోపించారు. అయినా తాను మౌనంగా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.భూ లావాదేవీలు, పేర్ల దుర్వినియోగం, అక్రమాలపై ఆరోపణలు, ప్రశ్నలు వచ్చినప్పుడు సమాధానాలు చెప్పాలి కానీ బెదిరించడం కాదని ఎద్దేవా చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తాను దేని కోసం నిలబడ్డానో తెలుసని. తాను భయంతో కాదు, వాస్తవాలతో స్పందిస్తానని పేర్కొన్నారు. సత్యం ఎప్పటికీ బెదిరింపులకు భయపడదన్న కేశినేని నాని.. తాను కూడా భయపడనని, రాజీపడబోనని స్పష్టం చేశారు.
Read more:Andhra Pradesh:అధికారులకు కలిసిరాని ఇంటెలిజున్స్ బ్యూరో.. నిన్న ఏవీబీ..ఇవాళ పీఎస్ ఆర్