Andhra Pradesh:తంబళ్లపల్లిలో తమ్ముళ్ల డిష్యూం.. డిష్యూం

Class differences suddenly surfaced in the TDP in Annamayya district

Andhra Pradesh:అన్నమయ్య జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. కొంతకాలంగా రెండువర్గాల మధ్య నివురుకప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిగ్గా మారాయి.జిల్లా ఇంచార్జ్ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఎదుటే ఢీ అంటే ఢీ అంటూ రెండువర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు ఘర్షణకు దిగారు. తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణుల సమావేశానికి మంత్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు.

తంబళ్లపల్లిలో తమ్ముళ్ల డిష్యూం.. డిష్యూం

తిరుపతి, ఏప్రిల్ 18
అన్నమయ్య జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. కొంతకాలంగా రెండువర్గాల మధ్య నివురుకప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిగ్గా మారాయి.జిల్లా ఇంచార్జ్ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఎదుటే ఢీ అంటే ఢీ అంటూ రెండువర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు ఘర్షణకు దిగారు. తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణుల సమావేశానికి మంత్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఓవైపు మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు, మరోవైపు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్ర రెడ్డి వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేశారట. అయితే రెండు వర్గాలకు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ వారు వినకపోవడంతో మంత్రి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఈ వివాదాన్ని టీడీపీ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.తంబళ్లపల్లి టీడీపీలో వర్గ విభేదాలు ఎందుకొచ్చాయి? సొంతపార్టీలోనే ఒకరంటే మరొకరికి పడని పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిగ్గా మారింది. ఈ వివాదం ఎందుకు మొదలైంది..? ఎక్కడ మొదలైందనేది ఓసారి చూస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న అసెంబ్లీ నియోజకవర్గం తంబళ్లపల్లి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 12 చోట్ల టిడిపి విజయం సాధించగా..పుంగనూరు, తంబళ్లపల్లి ఈ రెండు స్థానాలను మాత్రం కోల్పోయింది.

పుంగనూరులో వైసీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించగా…తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి స్వయాన సోదరుడు ద్వారకనాథ రెడ్డి విజయం సాధించారు. 2014లో టీడీపీ తరపున శంకర్ యాదవ్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందగా..2019, 2024 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు వైసిపి ఈ స్థానాన్ని దక్కించుకుంది. అప్పటి వరకు నియోజకవర్గ టిడిపి ఇంన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ టికెట్ ఆశించినా జయచంద్ర రెడ్డి అనే కొత్త నేతకు టికెట్ ఇవ్వడంతో ఆయన 10వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జయ చంద్రా రెడ్డి, శంకర్ యాదవ్ మధ్య విభేదాలు మొదలయ్యాయట.ఎన్నికల తర్వాత తంబళ్లపల్లి వ్యవహారం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందట. శంకర్ యాదవ్, జయ చంద్రారెడ్డిలు ఇద్దరు ఒకే పార్టీలోనే ఉన్నా రెండు వర్గాలుగా విడిపోవడంతో కొంత సమస్యగా మారింది. ఇద్దరూ తమ వర్గాలను అదుపులో పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ అప్పుడప్పుడూ వారు బలప్రదర్శనకు ప్రయత్నిస్తూనే ఉన్నారంట.దీంతో ఇద్దరు నేతల మధ్య రాజీ కుదిరించేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. అన్నమయ్య జిల్లా మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి తంబళ్లపల్లి వ్యవహారాన్ని చెక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ కోసం ఇద్దరూ కలిసి పనిచేయకపోతే అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని పార్టీ పెద్దలు సర్థిచెప్పే ప్రయత్నం చేస్తున్నారంట. ఈ వ్యవహారాన్ని చిలికి చిలికి గాలివానలాగా మార్చొద్దని పార్టీ కోసం ఇద్దరూ సర్దుకుపోవాలని సూచిస్తున్నారంట.తంబళ్లపల్లిలో పార్టీని గాటిన పెట్టేందుకు టిడిపి అధిష్టానం సీరియస్ గా ప్రయత్నిస్తోంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని జిల్లా పార్టీ ఇన్చార్జిగా ప్రకటించడమా లేక ఇద్దరినీ కాదని మరొక నేతను తెరపైకి తేవడమా లాంటి ప్రత్యామ్నాయాలపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Read more:Andhra Pradesh:యాక్టివ్ పాలిటిక్స్ లోకి విజయసాయి

Related posts

Leave a Comment