Andhra Pradesh:లిక్కర్ స్కామ్.. అందరూ డూమ్మాలే

Liquor scam accused in Andhra Pradesh are not taking the CID seriously.

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కాం నిందితులు సిఐడీని అసుల లెక్క చేయడం లేదు.  స్కాంలో కీలక నిందితులుగా చెబుతున్న ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకూ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు.   చాలా మమందిని విచారణకు పిలుస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు. కానీ పోలీసుల నోటీసుల్ని  అందుకని వాటిని గౌరవించిన వారు ఒక్కరూ లేరు.

లిక్కర్ స్కామ్.. అందరూ డూమ్మాలే

విజయవాడ, ఏప్రిల్ 18
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కాం నిందితులు సిఐడీని అసుల లెక్క చేయడం లేదు. స్కాంలో కీలక నిందితులుగా చెబుతున్న ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకూ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు.   చాలా మమందిని విచారణకు పిలుస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు. కానీ పోలీసుల నోటీసుల్ని  అందుకని వాటిని గౌరవించిన వారు ఒక్కరూ లేరు. తమకు ముందుగా నిర్ణయించిన పనులు ఉన్నాయని తాము .. మీరు చెప్పిన తేదీల్లో రాలేమని  నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. విజయసాయిరెడ్డికి సీఐడీ సాక్షిగా నోటీసులు జారీ చేసింది. ఆయన పద్దెనిమిదో తేదీన హాజరు కావాల్సి ఉంది. అయితే తాను పదిహేడునే వస్తానని సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.  హఠాత్తుగా గురువారం ఉదయం అనివార్య కారణాలతో తాను రావడం లేదని సమాచారం ఇచ్చారు. సీఐడీ అధికారులు ఈ సమాచారాన్ని సీరియస్ గా తీసుకుంటారో లేదో కానీ.. ఆయన కోసం శుక్రవారం ఎదురు చూసే అవకాశాలు ఉన్నాయి.లిక్కర్ స్కాంలో మరో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి కూడా సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. శనివారం విచారణకు రావాలని మిథున్ రెడ్డికి సీఐడీ సిట్ నోటీసులు పంపింది.

ఆయనకు రిలీఫ్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరిస్తే సుప్రీంకోర్టుకెళ్లారు. అక్కడ ముందస్తు బెయిల్ లభించింది.  విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ మిథున్ రెడ్డి మాత్రం శనివారం తనకు చాలా పనులు ఉన్నాయని.. ఆ పనుల్లో సీఐడీ విచారణ లేదని అంంటున్నారు. రాజ్ కసిరెడ్డి కోసం సీఐడీ సిట్ అధికారులు హైదరాబాద్‌లో వెదుకుతు  న్నారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలతో సహా బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. అయితే ఆయన దొరకలేదు. ఆయనకు నాలుగోసారి నోటీసులు జారీచేశారు.  హైకోర్టులో అరెస్టు నుంచి రక్షణ లభించనప్పటి నుండి  రాజ్ కసిరెడ్డి పరారీలో ఉన్నారు.  రాజ్ కసిరెడ్డికి ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం దాటిపోయే అవకాశాలు దాదాపుగా ఉండవు. అంతకు ముందే ఆయన విదేశాలకు వెళ్తే ఏమీ చేయలేరు..కానీ ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు.లిక్కర్ స్కాం చాలా సీరియస్ ఇష్యూ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దర్యాప్తు సంస్థల్లో మాత్రం అంత దూకుడు కనిపించడం లేదు. నోటీసులు జారీ చేస్తున్నారు కానీ.. ఒక్కరంటే ఒక్కరూ హాజరు కాకపోవడం.. దర్యాప్తు సంస్థలు కూడా అతం సీరియస్ గా తీసుకోకపోవడం చర్చనీయాంశమవుతోంది.

సీబీఐకి కేసు

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విధానం పేరుతో జరిగింది ఘోరమైన దోపిడీ అని టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది.  మద్యం విధానం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని చీప్ లిక్కర్ ను అత్యంత ఎక్కువ ధరలకు అమ్ముతూ ప్రజల్ని నిలువు దోపిడీ చేశారని అనేక సార్లు మండిపడ్డారు.  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఒక్క పాత బ్రాండ్ అమ్మకానికి లేదు. అన్నీ వైసీపీ నేతల డిస్టిలరీల్లో తయారయ్యే ఊరూపేరూ లేని మద్యాన్ని అమ్మారు. టార్గెట్లు పెట్టి మరీ అమ్మించారు. వాటిలో విష రసాయనాలు ఉన్నాయని నివేదికలు వచ్చినా పట్టించుకోలేదు. నగదు లావాదేవీలు మాత్రమే జరిపారు. మద్యం దుకాణాల్లో వైసీపీ నేతలు మాత్రమే  ఉన్నారు. మద్యం తయారీ , రవాణా, అమ్మకాలు మొత్తం వైసీపీ గుప్పిట్లో ఉన్నాయి. మద్యం ఎవరు తయారు చేశారు..ఎవరి గుప్పిట్లో తయారీ ఉంది.. వంటి వివరాలన్నీ బయటకు వచ్చాయి. స్వయంగా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి  కూడా గతంలో బయట పెట్టారు. ఇప్పటికే కేంద్రానికి లెక్క లేనన్ని ఫిర్యాదులు అందాయి.  ఆధారాలతో సహా టీడీపీ ఫిర్యాదు చేసింది. రఘురామ స్వయంగా ల్యాబుల్లో మద్యాన్ని టెస్టులు చేయించి రిపోర్టులు కేంద్రానికి సమర్పించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఫిర్యాదు చేశారు. గతంలో ప్రముఖ మద్యం కంపెనీలు కూడా .. కేంద్రానికి ఫిర్యాదు చేశాయి.  గడిచిన ఐదేళ్లలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు.

దీంతోపాటు విద్యుత్ సెక్టార్‌లో స్మార్ట్ మీటర్లు, PPAల్లో భారీ కుంభకోణాలు జరిగినట్లు బీజేపీ నేతలు చంద్రబాబుకు సూచించినట్లు చెప్పారు. సాంఘీక సంక్షేమ శాఖలోనూ అవినీతి జరిగిందని, వైసీపీ అవినీతిపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేతలు వెల్లడించారు.  లిక్కర్ స్కామ్‌పై విచారణ జరపాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ఆమె లేఖ రాశారు. ఈ మేరకు.. లిక్కర్ పేరుతో వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారని, ఏపీలో నాణ్యమైన లిక్కర్ అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. పురందేశ్వరి ప్రధానంగా లిక్కర్ కేసుపైనే దృష్టి పెట్టారు.   వైసీపీ ప్రభుత్వం ఓడిపోగానే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి పారిపోయే ప్రయత్నం చేశారు. తనతో పాటు చాలా రికార్డుల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన దొరికిపోయారు. ఆయనపై ఇప్పటికే సీఐడీ కేసు నమోదయింది. రైల్వే  సర్వీస్‌కు చెందిన ఆయనను వైసీపీ నేతలు ఏపీకి పిలిపించి.. ఆయన కేంద్రంగానే మద్యం దందా చేశారు.  వేల కోట్ల ఈ మద్యం స్కాంలో మొత్తం వాసుదేవరెడ్డినే ప్రధాన పాత్రధారి అనే అనుమానాలు . అయితే ఆయన కేవలం సంతకాలకే పరిమితమని.. కొంత కమిషన్ ఇచ్చి మిగతా అంతా నాటి ప్రభుత్వ పెద్దలే తీసుకునేవారని ఆయన సీఐడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

తన జీవితం కూడా పూర్తిగా జైలుకు పరిమితమవుతుందన్న అంచనాతో  ఆయన మొత్తం వివరాలు బయట పెట్టేందుకు సిద్ధమయ్యారని అయన అప్రూవర్ గా మారుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఐదేళ్ల పాటు సాగిన దోపిడీ వ్యవహారం అంతా పూసగుచ్చినట్లుగా వివరించి…  అసలు నిందితుల్ని జైలుకు పంపి.. తాను బయటపడేందుకు ఏపీబీసీఎల్ మాజీ ఎడీ వాసుదేవరెడ్డి సిద్ధమయ్యారని అంటున్నారు. ఏపీలో దర్యాప్తు సంస్థలు లిక్కర్ కేసుపై దర్యాప్తు చేస్తే.. అది కక్షసాధింపుగా ప్రచారం చేస్తారు. కానీ సీఐడీ విచారణలో వాసుదేవరెడ్డి వద్ద దొరికిన సాక్ష్యాలకు.. తమ వద్ద ఉన్న సాక్ష్యాలతో సీబీఐ విచారణచేయిస్తే.. అసలు కింగ్ పిన్ దొరికిపోతారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. తాము కక్షసాధింపులకు పాల్పడ్డారనే అపవాదు రాకుండానేరుగా సీబీఐ విచారణకు సిఫారసు చేసే అవకాశాలు ఉన్నాయి.  బీజేపీ నేతలు కూడా ఇదే స్కాంలో విచారణ కోసం పట్టుబడుతూండటంతో.. చంద్రబాబు కూడా సీబీఐకి అప్పగిస్తేనే మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తోసంబంధం ఉన్న అరబిందో శరత్ చంద్రారెడ్డి కంపెనీ కూడా ఈ స్కామ్‌లో కీలక పాత్ర పోషించినట్లుగా ఇప్పటికే పత్రాలు బయటకు వచ్చాయి.  అనుకున్నట్లుగా జరిగితే జగన్మోహన్ రెడ్డి పై సీబీఐ ఫ్రెష్ కేసులు రెడీ చేయడం ఖాయమేనని అనుకోవచ్చు.

Read more:Andhra Pradesh:టెట్ తో కలిసి డీఎస్సీ

Related posts

Leave a Comment