Nalgonda:వైద్య సాయం కోసం ఎదురుచూస్తున్న చిన్నారి హారిక” అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా

Chief Minister Revanth Reddy assures that he will support "Harika", a child waiting for medical help

Nalgonda:ల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్ లోని నందికొండ మున్సిపాలిటీలో.. చిన్నారి హారిక వేదనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నందికొండ మున్సిపాలిటీకి సిద్వంతి కి రెండేళ్ల క్రితం భర్త చనిపోయారు. ఈ క్రమంలో పుట్టింటిలోనే ఉంటుంది. కూతురు హారిక ఇంటిముందు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అప్పట్లో నాగార్జునసాగర్ లోని కమలానే గురు ఆసుపత్రిలో చికిత్స చేయించారు.

వైద్య సాయం కోసం ఎదురుచూస్తున్న చిన్నారి హారిక”
అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా

నల్గోండ
నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్ లోని నందికొండ మున్సిపాలిటీలో.. చిన్నారి హారిక వేదనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నందికొండ మున్సిపాలిటీకి సిద్వంతి కి రెండేళ్ల క్రితం భర్త చనిపోయారు. ఈ క్రమంలో పుట్టింటిలోనే ఉంటుంది. కూతురు హారిక ఇంటిముందు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అప్పట్లో నాగార్జునసాగర్ లోని కమలానే గురు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. రెండో డోస్ కుక్క అటు టీకా వేసిన తర్వాత.. వారం రోజుల పాటు తీవ్ర జ్వరంతో హారిక బాధపడింది. జ్వరం ఉన్నప్పుడే మూడో డోసు టీకా ఇవ్వడం.. జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే చిన్నారి హారిక కాళ్లు చేతులు స్పర్శ కోల్పోయాయి. అటు నుంచి నీలోఫర్ ఆసుపత్రికి పంపారు. ఆ సమయంలోనే పూర్తిగా కాళ్లు చేతులు పడిపోయాయి.

అయినప్పటికీ పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో కుమార్తె వైద్యం కోసం లక్షల ఖర్చు చేసినప్పటికీ.. చిన్నారి ఇంతవరకు ఉళుకు పలుకు లేకుండా ఉంటుంది. కనీసం ఆకలైన అడగలేని స్థితిలో చిన్నారి హారిక ఉంది. భర్త చనిపోవడం.. ఉన్న ఆస్తులమ్మి చిన్నారి వైద్యం చేయించడంతో.. ఇప్పుడు తల్లి సిద్వంతి పరిస్థితి దయనీయంగా మారింది. కుటుంబ పోషణ కోసం.. కూతురుని వదిలి బయట ఏ పని చేసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో.. తమ దయనీయ పరిస్థితిని చూసి.. ప్రభుత్వం స్పందించి.. తమ కూతురుకు వైద్య సాయం అందించాలని.. తమకు ప్రభుత్వం అండగా నిలబడాలని తల్లి సిద్వంతి వేడుకుంటుంది. చిన్నారి హారికను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి.. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను ఆదేశించారు. హారిక ఆరోగ్య పరిస్థితిని ఉన్నతాధికారుల ద్వారా అడిగి తెలుసుకొని ఆ కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆదుకోవడానికి నా అవకాశాలు పరిశీలించాలని సీఎం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే సాగర్ లోని కమల నెహ్రూ ఆసుపత్రి సిబ్బంది మున్సిపల్ సిబ్బంది బాలిక నివాసానికి వెళ్లి హారిక ఆరోగ్య వివరాలు సేకరించారు.

Read more:సంక్షిప్త వార్తలు:04-18-2025

Related posts

Leave a Comment