సంక్షిప్త వార్తలు:09-05-2025:ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ ఉగ్రమూకలను మట్టు పెట్టిన నేపద్యంలో ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వివాదానికి దారితీసింది. పాకిస్తాన్ కు మద్దతుగా పాకిస్తాన్ వాళ్ళు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు వారికి అల్లా ఎప్పుడు అండగా ఉంటారు. ఈ హైదరాబాదు ఇస్లామిక్ రాష్ట్రము మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారని పోస్ట్ చేయడం ఉద్రిక్తత కు దారితీసింది.
పాకిస్థాన్ కు మద్దతుగా విద్యార్దిని పోస్టు
బీజేవైఎం నిరసన
హైదరాబాద్
ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ ఉగ్రమూకలను మట్టు పెట్టిన నేపద్యంలో ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వివాదానికి దారితీసింది. పాకిస్తాన్ కు మద్దతుగా పాకిస్తాన్ వాళ్ళు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు వారికి అల్లా ఎప్పుడు అండగా ఉంటారు. ఈ హైదరాబాదు ఇస్లామిక్ రాష్ట్రము మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారని పోస్ట్ చేయడం ఉద్రిక్తత కు దారితీసింది.
ఈ ఘటనపై సదరు విద్యార్థినిపై. బీజేవైఎం నాయకులు ఐఎస్ సదన్ పోలీస్టేషన్ లో పిర్యాదు చేశారు. కాలేజీలో అడ్మిషన్ రద్దుచేసి తనపై కఠిన చర్య తీసుకోవాలని చంపాపేట్ లోని కళాశాలలో ఆందోళన చేపట్టారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యం హామీ ఇవ్వడంతో శాంతించారు. సదరు విద్యార్థినిపై కేసు నమోదు చేసే వరకు ఊరుకునేది లేదని నేతలు హెచ్చరించారు
లక్ష్మీస్ సలోన్ అకాడమీ మొదటి బ్రాంచ్ కొత్తపేట్లోని ఆర్కేపురంలో ప్రారంభం
రంగారెడ్డి
కొత్తపేటలోని ఆర్కె పురంలోని అల్కాపురి కాలనీలో లక్ష్మీస్ సలోన్ అకాడమీ తమ తొలి శాఖను ప్రారంభించింది. ప్రారంభోత్సవానికి బిజెపి నాయకుడు సోమ రంగారెడ్డి, కార్పొరేటర్లు రాధా ధీరత్రెడ్డి, తదితరులు హాజరయ్యారు. నిపుణులైన లక్ష్మి మరియు భాగస్వామి నాగేష్ కలిసి ప్రారంభించిన ఈ సలోన్, హెయిర్కట్లు, స్టైలింగ్, స్కిన్కేర్, బ్రైడల్ మేకప్, ఫేషియల్స్, వాక్సింగ్ వంటి ప్రీమియం సేవలు అందిస్తోంది.
ప్రైవేట్ వాష్ హౌస్ వంటి విలాసవంతమైన సౌకర్యాలు ప్రత్యేక ఆకర్షణ. అకాడమీ ద్వారా మేకప్, బ్యూటీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి అని అన్నారు. లక్ష్మి మాట్లాడుతూ, “మేము కేవలం సలోన్ కాదు, ఒక అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు. “ప్రతి కస్టమర్కు అత్యుత్తమ సేవలు అందించడమే మా ధ్యేయం” అన్నారు.
ఎంఎల్సిగా ప్రమాణం చేసిన కావలి గ్రీష్మ
అమరావతి, మే 9
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యురాలుగా ఇటీవల ఎంపికైన కావలి గ్రీష్మ ఎంఎల్సిగా ప్రమాణం చేశారు.ఈమేరకు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని శాసన మండలి అధ్యక్షులు చైర్మన్ కొయ్యే మోషన్ రాజు వారి చాంబరులో ఆమెతో శాసన మండలి సభ్యురాలుగా ప్రమాణం చేయించారు.అనంతరం శాసన మండలి నియనిబంధనలకు సంబంధించిన కిట్ ను చైర్మన్ మోషేన్ రాజు ఎంఎల్సి గ్రీష్మకు అందించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర,శాసన మండలి సభ్యురాలు గ్రీష్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పెందుర్తిలో మేగా జాబ్ మేళా
పాల్గోన్న మంత్రి అనిత
విశాఖపట్నం
పెందుర్తి నియోజకవర్గం, పెందుర్తి పి యం శ్రీ గవర్నమెంట్ హై స్కూల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మేగా జాబ్ మేళా కు ముఖ్య అతిథిగా హాజరైన హోం మంత్రి వంగలపూడి అనిత హజరయ్యారు. హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జాబ్ మేళాలు లేవు. గతంలో ప్రభుత్వ నోటిఫికేషన్స్ లేవు. గత ప్రభుత్వం తప్పిదాలు వలన యువత ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు జరుగుతున్నాయి. కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు.
అంటే రైతుల యొక్క త్యాగఫలితం. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆద్వర్యంలో పెద్దసంఖ్యలో ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. రానున్న ఒక సంవత్సరంలోనే పదివేల ఉద్యోగాలు రాబోతున్నాయి. ప్రభుత్వం యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. పహల్గామ్ ఘటనతో ఎంతో బాధపడ్డాము. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ను ఢీకుంటున్నాము. దేశ ప్రజలు క్షేమం కోసం సైనికులు ఎంతో కృషి చేస్తున్నారు. సమస్య వస్తే తట్టుకొని నిలబడే శక్తి యువతకు ఉండాలి. కంపెనీలు కూడా మానవత దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు. . నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి మధ్ధతుగా వందేమాతరం నినాదాలు హోం మంత్రి చేసారు. పదోతరగతి ఫలితాల్లో అత్యథిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు.