సంక్షిప్త వార్తలు:09-05-2025

MLC Ananthababu lashes out at temple staff

సంక్షిప్త వార్తలు:09-05-2025:అన్నవరం సత్యదేవుని సన్నిధిలో గురువారం రాత్రి సత్యదేవుని వార్షిక దివ్య కళ్యాణము అనంతరము శ్రీ స్వామీ వారి అక్షంతలు ఇవ్వడం లేటు అయ్యిందని  వై. సీ.పి. ఎం.ఎల్. సి. అనంత బాబు, ఆయన అనుచరులు,సత్యదేవుని భక్తుల సమక్షంలో దేవస్థానం అధికారులుల పై, దూషణలకు  పాల్పడ్డారు. అక్కడ వున్న ఇఓ  సుబ్బారావు పై అనంతబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఆలయ సిబ్బంది పై ఎమ్మెల్సీ అనంతబాబు మండిపాటు

కాకినాడ
అన్నవరం సత్యదేవుని సన్నిధిలో గురువారం రాత్రి సత్యదేవుని వార్షిక దివ్య కళ్యాణము అనంతరము శ్రీ స్వామీ వారి అక్షంతలు ఇవ్వడం లేటు అయ్యిందని  వై. సీ.పి. ఎం.ఎల్. సి. అనంత బాబు, ఆయన అనుచరులు,సత్యదేవుని భక్తుల సమక్షంలో దేవస్థానం అధికారులుల పై, దూషణలకు  పాల్పడ్డారు. అక్కడ వున్న ఇఓ  సుబ్బారావు పై అనంతబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. దళిత డ్రైవర్ హత్య కేసులో నిందితుడు , ప్రజా నాయకులు ఇలా ప్రవర్తించాడు మంచిది కాదని పలువురు విమర్శలు చేస్తున్నారు

జూలూరు పిఏసిఎప్ సీఈవో ను సస్పెండ్ చేసిన కలెక్టర్

Sangareddy collector M Hanumantha Rao given as additional charge as  Siddipet collector

యాదాద్రి-భువనగిరి
భూదాన్ పోచంపల్లి (మo), జూలూరు ఆమ్లెట్ అలీనగర్ పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హనుమంత రావు ఆకస్మికంగా తనిఖీ చేసారు. తేమ శాతం ఉన్న వడ్లను కంటా చేసి లోడింగ్ చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్న జూలూరు పిఏసిఎస్ సీఈఓ నరసింహ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

భారత సైన్యానికి మద్దతుగా పూజలు

భారత సైన్యానికి మద్దతుగా ప్రత్యేక పూజలు | general

మెదక్
ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని దేవస్థానం లో ఆపరేషన్ సిందూర్ లో ధైర్యముగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్ ఆదేశాల ప్రకారం ఏడుపాయల వన దుర్గ భవాని దేవస్థానం   నందు  ప్రత్యేక పూజలు చేసారు.  భారత్ కు అఖండ మైన విజయం సైనికులకు ఎటువంటి నష్టం జరగకుండా హోమం ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు.

క్రీడల అభివృద్దికి పూర్తి సహకారం

క్రీడ - వికీపీడియా
విశాఖలో అన్ని రకాల క్రీడల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ రవి నాయుడు పేర్కొన్నారు. క్రీడల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం మరియు వివిధ క్రీడా సంఘాల సమన్వయం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వేసవి క్రీడా శిబిరాలు, క్రీడా రంగ అభివృద్ధిపై విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్  హరేంధిర ప్రసాద్ , ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు  , విఎంఆర్‌డిఏ కమీషనర్ కె విశ్వనాథ్ లతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

క్రీడాభివృద్ధి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖలో క్రీడల అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. విశాఖను క్రీడా, పర్యాటక , సాంస్కృతిక కేంద్రంగా మలిచేందుకు ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్ర గారి చొరవతోనే ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా విభాగంలో 3 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని, ఇది క్రీడల అభివృద్ధికి ఒక గొప్ప ముందడుగు అని కొనియాడారు.పాఠశాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలల్లో క్రీడా సామాగ్రి కొనుగోలుకు రూ. 30 వేలు, ప్రాథమిక పాఠశాలలకు 17 వేలు మంజూరు చేస్తోందని ఆయన వెల్లడించారు.

 

Related posts

Leave a Comment