సంక్షిప్త వార్తలు:09-05-2025

Mock drill of ex-servicemen in Khammam

సంక్షిప్త వార్తలు:09-05-2025:ఖమ్మం నగరంలోని ఇండియన్ వెటర్న్ ఆర్మీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్ఎస్పీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని మాక్ డ్రిల్ చేపట్టారు. పాకిస్తాన్ తో యుద్ధంలో తమ అవసరముంటే వెళ్లడానికి సిద్ధమేనని, పాకిస్తాన్ అంతం చూస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో యుద్ధ తంత్రంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ ఏర్పాటు చేసినట్లు మాజీ ఆర్మీ అధికారులు తెలిపారు.

ఖమ్మంలో మాజీ సైనికుల మాక్ డ్రిల్

ఖమ్మం
ఖమ్మం నగరంలోని ఇండియన్ వెటర్న్ ఆర్మీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్ఎస్పీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని మాక్ డ్రిల్ చేపట్టారు. పాకిస్తాన్ తో యుద్ధంలో తమ అవసరముంటే వెళ్లడానికి సిద్ధమేనని, పాకిస్తాన్ అంతం చూస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో యుద్ధ తంత్రంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ ఏర్పాటు చేసినట్లు మాజీ ఆర్మీ అధికారులు తెలిపారు. సెల్ఫ్ డిఫెన్స్, ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ, బ్లాక్ అవుట్, ప్రధమ చికిత్స, ఎమర్జెన్సీ లైఫ్ జాకెట్ అవగాహన కల్పించారు. మాక్ డ్రిల్ లో మాజీ సైనికు ఉద్యోగులు, ఎన్సిసి క్యాడేట్లు,ఫైర్, రైల్వే పోలీస్ శాఖ సిబ్బంది,స్కౌట్స్ అండ్ గైడ్స్, విద్యార్థులు,యువతీ యువకులు పాల్గొన్నారు. ఉగ్రవాదానికి  మతం ,కులం అనేది వుండదు అని  ముస్లిం బాలిక  దుర్గాష్టకం. పటించి మన సైన్యం ఉగ్రవాదులను అంతం చేయాలి అని కోరారు..

వేధింపులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం

MLA Ravindranath Reddy | సీఎం వైఎస్‌ జగన్‌ మామ రవీంద్రనాథ్‌ రెడ్డి  ఓటమి-Namasthe Telangana

కడప
కడపలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశం కోసం నిత్యం శ్రమిస్తున్న సైనికులకు సెల్యూట్. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం హర్షణీయం. రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషియల్ మీడియా నాయకుల వేధింపులే లక్ష్యం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు. స్కీములు ఏమి లేవు కానీ అన్ని స్కాములేనని అన్నారు.

1.70 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనులు చేయలేదు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటి పై పోలీసుల దాడులు అప్రజాస్వామికం. కనీసం ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా కుటుంబ సభ్యులను వేధించడం దారుణం. సాక్షి మీడియా ప్రతినిధులను బెదిరిస్తూ అక్రమాలు ప్రశ్నిస్తే కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు. లేని లిక్కర్ స్కాం బయటకు తీసి అబద్ధాలే ఆరోపణలు గా కేసులు పెడుతున్నారు. అధికారులను, నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అమతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు..

జవాన్ మురళి నాయక్ వీరమరణం

తెలుగు జవాన్ మురళి వీర మరణం
శ్రీసత్యసాయి
యాంకర్ .. పాక్ దాడుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ జవాన్ వీరమరణం పొందాడు. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసిన తర్వాత, కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ సైన్యం విచక్షణ లేకుండా కాల్పులకు పాల్పడుతోంది. ఈ కాల్పుల్లో పలు గ్రామాల్లో ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. శత్రు చర్యలకు భారత సైన్యం సమర్థవంతంగా ప్రతిఘటిస్తూనే ఉంది.జరిగిన కాల్పుల్లో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం, పుట్టగుండ్లపల్లి తండాకు చెందిన జవాన్ మురళి నాయక్ వీర మరణం పొందారు. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదం అలముకుంది. మురళి నాయక్ చిన్న గిరిజన కుటుంబానికి చెందినవారు. వారి మరణవార్త కుటుంబానికి తెలియగానే గ్రామం మొత్తం శోకసంద్రంగా మారింది.

వైభవంగా సత్యదేవుడి వార్షిక కళ్యానోత్సవం

Annavaram: కమనీయం సత్యదేవుడి దివ్యకల్యాణం | Divine Wedding of Lord Satyadeva  Celebrated Grandly in Annavaram

అన్నవరం
భక్తవరదుడు,రత్నగిరి వాసుడు, సత్యమైన దైవంగా పేరొందిన అన్నవరం సత్యదేవుడు.. వార్షిక కళ్యాణం మహోత్సవాన్ని భక్తులు కన్నులారా తిలకించి  పులకించిపోయారు. వైశాఖ శుద్ధ ఏకాదశి, గురువారం రాత్రి 10.30 గంటల సుముహూర్తంలో సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణం అత్యంత  వైభవంగా జరిపారు పండితోత్తములు పఠించిన సుస్వర వేద మంత్రాలు సాక్షిగా,సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు  ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూ, యనమల దివ్య  దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు ముత్యాల తలంబ్రాలు, నూతన వస్త్రాలు సమర్పించారు…

Related posts

Leave a Comment