సంక్షిప్త వార్తలు:09-05-2025

brife news

సంక్షిప్త వార్తలు:09-05-2025:అపరేషన్ సిందూర్ లో భాగంగా  జమ్మూ కశ్మీర్  యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మంత్రి అన్నారు. . శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన  మురళి నాయక్ చూపిన ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం.

యుధ్దభూమిలో జవాను మురళి నాయక్ వీరమరణం
సంతాపం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్

తాడేపల్లి
అపరేషన్ సిందూర్ లో భాగంగా  జమ్మూ కశ్మీర్  యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మంత్రి అన్నారు. . శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన  మురళి నాయక్ చూపిన ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని అన్నారు.

విశాఖ తీర ప్రాంతంలో అగ్ని ప్రమాదం
పచ్చదననీ హరిస్తున్న అగ్ని

The flaming palm tree in Los Angeles: a sad July 4th ritual - Los Angeles  Times
రుషికొండ సమీపంలో ఉన్న రామానాయుడు స్టూడియో ఎదురుగా సముద్ర తీరం ని ఆనుకొని ఉన్న తాటి చెట్ల మధ్య చెలరేగిన మంటలు. అగ్ని ప్రమాదంలో సుమారు 30 చెట్లు వరకు ఖాళీ బూడిదైనవి సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్న ఫైర్ సిబ్బంది ఈ అగ్ని ప్రమాదం సహజంగానే జరిగిందా?  లేదా మనుషుల నిర్లక్ష్యం  వల్ల జరిగిందా అనేది తెలియాల్సిఉంది

మురళి నాయక్ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

Chandrababu : మృతులకు చంద్రబాబు సంతాపం | tdp chief chandrababu naidu  expressed shock over the death of 10 people in road accidents
తాడేపల్లి
దేశ రక్షణలో  శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

జోహార్ మురళీనాయక్

Telugu Soldier Murali Naik Died In Pak Firing,దేశ రక్షణలో తెలుగు జవాన్ వీర  మరణం.. సెల్యూట్ టు మురళీనాయక్ - telugu jawan murali naik from andhra  pradesh died in pakistan firing - Samayam Telugu
పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్దంలో సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన జవాను మురళీ నాయక్ వీర మరణం పొందడం తీవ్ర వేదనను కల్గించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు విడిచిన మురళీ నాయక్ వీర మరణం తెలుగు ప్రజలకే కాక దేశ ప్రజలందరికీ స్పూర్తి దాయకం. పాకిస్తాన్ తో యుద్దంలో మురళీ నాయక్ ప్రదర్శించిన ధైర్యసాహసాలకు బిగ్ సెల్యూట్. మురళీ నాయక్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. మురళీ నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.

Related posts

Leave a Comment