సంక్షిప్త వార్తలు:10-05-2025:పెద్దమ్మతల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్,ఎమ్మెల్సీ బండా ప్రకాష్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తదితరులు కోరుకున్నారు.శనివారం శాయంపేట మండలం, కొప్పుల గ్రామంలో ముదిరాజ్ ల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ చైర్మన్,ఎమ్మెల్సీ బండా ప్రకాష్,మాజీ ఎమ్మెల్యే గండ్ర
శాయంపేట
పెద్దమ్మతల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్,ఎమ్మెల్సీ బండా ప్రకాష్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తదితరులు కోరుకున్నారు.శనివారం శాయంపేట మండలం, కొప్పుల గ్రామంలో ముదిరాజ్ ల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ రాష్ట్ర నాయకులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు,ముదిరాజ్ సోదర సోదరీమణులు,బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సైప్రస్ లో గురజాల విద్యార్ది మృతి
పల్నాడు
ఉన్నత విద్య కోసం సైప్రస్ కంట్రీ వెళ్లి గురజాల విద్యార్థి కారు ప్రమాదం లో మృతి చెందాడు. పల్నాడు జిల్లా గురజాల పట్టణానికి చెందిన నవీన్ గత 18 నెలల క్రితం ఉన్నత విద్యకోసం సైప్రస్ కంట్రీకి వెళ్లాడు. నిన్న రాత్రి కారు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం అందింది. నవీన్ అక్కడ ఉన్నత విద్య అభ్యసిస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాడు. చేతికి అందోచ్చిన కొడుకు మృతి చెందడంతో గురజాల పట్టణంలో ఉన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
మామిడి గోదాంలపై టాస్క్ ఫోర్సు దాడులు
హైదరాబాద్
ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కాల్షియం కార్బైడ్ను వినియోగిస్తూ.. కృత్రిమ పద్ధతిలో మామిడి పండ్లను మగ్గ పెడుతున్న గోదాంలపై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు,జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీమ్ నగర్, శాలి వాహన నగర్ లలో గోదాములపై దాడి చేశారు . సలీమ్ నగర్ గోదాంలో సుమారు రూ.60 వేలు.శాలివాహన నగర్ లో రూ.3.50 లక్షల విలువ గల పండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లను గోదాంలుగా ఉపయోగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మాగ పెట్టేందుకు ఎథిలైన్, కాల్షియం కార్బైడ్, కాల్షియం ఎసిటిలైడ్ వంటి కెమికల్స్ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్ వాడటం వల్ల ప్రజలకు చర్మ, ఊపిరితిత్తులు.. తదితర ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు.
కాల్షియం కార్బైడ్ ఇది నిషేధిత పదార్థం. కానీ పండ్ల వ్యాపారులు మాత్రం 15 కిలోల మామిడికాయలు పండ్లుగా మారేందుకు కాల్షియం కార్బైడ్కు సంబంధించి చిన్న సాషెట్ను సబ్బు పెట్టెల్లో పెట్టి మగ్గిస్తున్నారు. దీంతో 3 .4 రోజుల్లో జరిగే మగ్గింపు ప్రక్రియ కేవలం 1 రోజులోనే పూర్తవుతుంది. ఇదే వ్యాపారులకు దురాశను కలిగించింది. ఈ దాడుల్లో మొత్తం రూ.4.10 లక్షల విలువ చేసే మామిడి పండ్ల ను .ఇద్దరి వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు..ఈ కేసు ను తదుపరి విచారణ నిమిత్తం మలక్ పేట పోలీసులకు అప్పగించారు…
సిగరెట్ వ్యాపారులను బెదిరించే ముఠా అరెస్టు
నిందితుల్లో ఒకరు జైలు వార్డెన్, మరోకరు పోలీసు కానిస్టేబుల్
సిగరెట్ సప్లై చేసే వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసారు. జైల్ వార్డెన్ అయిన గయిని శ్రీకాంత్(36), పోలీస్ కానిస్టేబుల్ చిదిరి అమర్నాథ్(41) మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పాటు బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. సిగరెట్లు తరలిస్తున్న వారిని రోడ్డు పై అడ్డగించి, గంజాయి సరఫరా చేస్తున్నారంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసారు.
వీరంతా గతంలో సైతం ఇటువంటి నేరానికి పాల్పడి జైలుకు వెళ్లినట్లు గుర్తించారు. జైలు నుండి విడుదలై మియాపూర్, సైఫాబాద్, అల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బెదిరించి డబ్బులు వసూలు చేసారు. మియాపూర్ పోలీసులు ముఠా సభ్యులందరిని అరెస్ట్ చేసి రిమండుకు తరలించారు.
ప్రగతినగర్ లో అగ్ని ప్రమాదం
కుత్బుల్లాపూర్
బాచుపల్లి పియస్ పరిదిలోని ప్రగతినగర్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఓ డెకరేషన్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా నిల్వఉంచిన డెకరేషన్ సామాన్లలకు మంటలు అంటుకున్నాయి. ఒక్క సారిగా మంటలు ఎగసి పడడం తో ప్రక్క అపార్ట్ మెంట్ వాసులు భయబ్రాంతులకు గురైయారు. వెంటనే తేరుకొని వాటర్ కొట్టడంతో అపార్ట్ మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. మంటల వేడి ధాటికి అపార్ట్ మెంట్ గోడలు,పగిలిన కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయివ. స్తానికుల సమాచారంతో ఫైర్ ఇంజన్స్ తో మంటలు అదుపుచేసారు.