Adilabad:సిబ్బంది కేసుల దర్యాప్తులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

SP Akhil Mahajan

Adilabad:సిబ్బంది పోలీసు వ్యవస్థలో అందించబడిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నేరస్థులను పట్టుకోవాడానికి నిష్ణాతులు కావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. హైదరాబాద్ నుండి విచ్చేసిన సెంట్రల్ డిటెక్టివ్ ద్వారా ఆదిలాబాద్ లోని నూతన ఎస్ఐలు మరియు నూతన పోలీసు సిబ్బందికి నేరస్తులను సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కనుగొనడంలో రెండు రోజులపాటు శిక్షణను అందజేయడం జరిగిందని తెలిపారు.

సిబ్బంది కేసుల దర్యాప్తులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి:
ఎస్పీ అఖిల్ మహాజన్

సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా రెండు రోజుల శిక్షణ
సైబర్ క్రైమ్స్ డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్, సి డి ఆర్ మరియు ఐపిడిఆర్ లపై పూర్తి శిక్షణ.
సైబర్ నేరాలు, నేరస్తులను కనుగొనడంలో అధునాతన పరిజ్ఞానం వినియోగంపై సిబ్బందికి శిక్షణ.
శిక్షణ లో పాల్గొన్న నూతన ఎస్ఐలు, పోలీసు సిబ్బంది.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.

సిబ్బంది పోలీసు వ్యవస్థలో అందించబడిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నేరస్థులను పట్టుకోవాడానికి నిష్ణాతులు కావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. హైదరాబాద్ నుండి విచ్చేసిన సెంట్రల్ డిటెక్టివ్ ద్వారా ఆదిలాబాద్ లోని నూతన ఎస్ఐలు మరియు నూతన పోలీసు సిబ్బందికి నేరస్తులను సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కనుగొనడంలో రెండు రోజులపాటు శిక్షణను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ శిక్షణ వినియోగించుకొని నేరస్తుల ఖచ్చితమైన లొకేషన్ ప్రదేశాలను గుర్తించడం, నేరాలను కనుగోనబడడం, నేరాల దర్యాప్తు, టవర్ డంప్, కాల్ డేటా ఎనాలసిస్, లోకేషన్ లాంటివి పరిజ్ఞానాల్లో సైబర్ నేరాలు వినియోగిస్తున్న ప్రస్తుత పద్ధతులు వాటిని చేదించే విధానాలను సిబ్బందికి సంక్షిప్తంగా క్లుప్తంగా వివరించి శిక్షణను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ నేరస్థుల వినియోగించే ఆపరేటింగ్ సిస్టం, ఐపీ అడ్రస్, లొకేషన్, లాంటివి కనుగొనే పద్ధతి లను వివరించారు. అదేవిధంగా నెట్వర్క్ ప్రొవైడర్లతో మాట్లాడి కావాల్సినటువంటి సమాచారాన్ని తీసుకునే విధానం, ఉపయోగించవలసిన యాప్ ల పనితీరు పై వివరించారు. అదేవిధంగా న్యాయస్థానం నందు నేరస్తులకు శిక్షలు పడటానికి కావలసినటువంటి పంచనామా రాయు విధానం, ముఖ్యంగా మహిళల మిస్సింగ్ కేసులలో, సోషల్ మీడియా నందు జరిగే సైబర్ క్రైమ్ ఫ్రాడ్ కేసులలో విచారణ చేయు పద్ధతులపై పూర్తి పరిజ్ఞానాన్ని సంపాదించి నిష్ణాతులు కావాలని సూచించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సిబ్బంది రెండు రోజులపాటు జిల్లా పోలీసు సిబ్బందికి పూర్తి పరిజ్ఞానాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైనథ్ సిఐ డి సాయినాథ్, రూరల్ సీఐ కె ఫణిదర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి వెంకటి, అఖిలేష్ రావు సైబర్ ఎక్స్పర్ట్, శ్రీధర్ డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్, మహేందర్ రెడ్డి సిడిఆర్ మరియు ఐ పి డి ఆర్ ఎక్స్పర్ట్ హైదరాబాద్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read more:సంక్షిప్త వార్తలు:09-05-2025

Related posts

Leave a Comment