Health news:ప్రస్తుతం మానవ జీవన శైలిలో వస్తున్న మార్పులు, తగ్గుతున్న శారీరక శ్రమ, ఆహార అలవాట్లు అనేక రుగ్మతలకు దారి తీస్తున్నాయని, ప్రతీ రోజు కనీసం అరగంట నడక ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కారంమని వాకార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకరి కుమార్ అన్నారు. సోమవారం వాకార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు.
ఆరోగ్యం బాగుకోసం నడక శ్రేయస్కరం
మెగా హెల్త్ క్యాంపులో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకరి కుమార్
మంథని
ప్రస్తుతం మానవ జీవన శైలిలో వస్తున్న మార్పులు, తగ్గుతున్న శారీరక శ్రమ, ఆహార అలవాట్లు అనేక రుగ్మతలకు దారి తీస్తున్నాయని, ప్రతీ రోజు కనీసం అరగంట నడక ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కారంమని వాకార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకరి కుమార్ అన్నారు. సోమవారం వాకార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో ఆరోగ్యం పట్ల మరింత చైతన్యం పెరిగిందని, నడక, యోగా, వ్యాయామంపై అత్యధికులు ఆసక్తి చూపుతున్నారని క్రమం తప్పకుండా రోజూ నడిస్తే మధు మేహం వచ్చే అవకాశం తగ్గుతుందన్నారు. అలాగే మధుమేహ ఉన్నా సరే గ్లూకోజు అదుపులో ఉంటుందని, అధిక రక్తపోటు, గుండె, క్యాన్సర్ సమస్యలు తదితర ముప్పును తగ్గిస్తుందని, శరీర బరువును నియం త్రిస్తుందని, మానసిక ఒత్తిడి, నిద్రలేమిని అధిగమించవచ్చునని, జీవ క్రియలను మెరుగుపర్చుతుందని, మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరగడంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని ఆయన తెలిపారు. ఈ శిబిరంలో 120 మందికి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దీక్షిత్ వైద్య పరీక్షలు చేశారు.
అవసరమైన వారికి షుగర్, బీపీ, 2డి ఎకో పరీక్షలు చేపట్టి రోగనిర్దారణ చేశారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ వాకర్స్, జర్నలిస్టులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి నాంపల్లి రమేష్, గౌరవ అధ్యక్షులు రావికంటి మనోహర్, కొమరోజు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వేల్పుల గట్టయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరి గంధం ఆంజనేయులు, సాంస్కృతిక కార్యదర్శి లక్కాకుల నాగరాజు,గెజిటెడ్ అధికారుల సంఘం సంస్కృతిక కార్యదర్శి రావుల తిరుమల్, సహాయ కార్యదర్శి తాటి సమయ్య గౌడ్, కోశాధికారి సిలివేరి సతీష్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పోతరాజు సమ్మయ్య, మాజీ సర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు కోమురోజు మారుతి బర్ల సంపత్, బాసాని సాగర్, రాజిరెడ్డి హరిష్, దాసరి రాజేశం, మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read more:సంక్షిప్త వార్తలు:05-05-2025