Hyderabad:ఆపరేషన్ కగార్‌’కు తాత్కాలిక బ్రేక్

temporary-break-for-operation-kagar

Hyderabad:తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇండియా- పాకిస్తాన్‌ సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా ఈ నిర్ణయం తీసుకుంది. మావోయిస్టుల కంచుకోటగా భావిస్తున్న కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్న CRPF బలగాలను వెంటనే వెనక్కి రావాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు.

ఆపరేషన్ కగార్‌’కు తాత్కాలిక బ్రేక్

హైదరాబాద్, మే 10
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇండియా- పాకిస్తాన్‌ సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా ఈ నిర్ణయం తీసుకుంది. మావోయిస్టుల కంచుకోటగా భావిస్తున్న కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్న CRPF బలగాలను వెంటనే వెనక్కి రావాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. తెలంగాణ సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా మోహరించిన CRPF కోబ్రా ప్రత్యేక దళాల జవాన్లు వెంటనే తమ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు అందాయి. దీంతో ములుగు జిల్లాలోని సున్నితమైన ప్రాంతాల నుంచి బలగాలు ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొనడానికి హుటాహుటిన బయలుదేరుతున్నాయి. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, దాదాపు 5 వేల మంది CRPF జవాన్లను కర్రెగుట్టల నుంచి వెనక్కి రప్పిస్తున్నారు. ఈ బలగాలు రేపటి ఉదయానికల్లా అంతర్జాతీయ సరిహద్దుకు చేరుకోనున్నాయి.

దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మావోయిస్టులపై పోరాటం మాత్రం కొనసాగుతుంది. అక్కడ DRG, STF, బస్తర్ ఫైటర్స్ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ యథావిధిగా కొనసాగనుంది. దాదాపు 20 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. ఏప్రిల్ 26న 38 మంది, మే 7న 22 మందితో పాటు మరికొందరు మరణించారు. ఈ ఆపరేషన్‌లో నలుగురు పోలీసులు సైతం ప్రాణాలు కోల్పోయారు.ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మావోయిస్టులు ఆరు నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల నుండి శాంతి చర్చల కోసం వస్తున్న డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణం ఏర్పరచడానికి ఈ కాల్పుల విరమణ ప్రకటన ఒక ప్రయత్నంగా చూడాలన్నారు. తాజాగా భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తల నేపథ్యంలో ఆపరేషన్ కగార్‌కు కేంద్రం తాత్కాలికంగా బ్రేక్ వేసింది.

Read more:సంక్షిప్త వార్తలు:10-05-2025

Related posts

Leave a Comment