Kakinada:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఓటమి నుంచి చాలా రకాలుగా గుణ పాఠాలు నేర్చుకుంది. ముఖ్యంగా అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమి బాధ నుంచి బయటకు వచ్చారు. పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా కూడా వేగం పెంచుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో ప్రజల మధ్యకు వచ్చి పోరాటం చేయాలని భావిస్తున్నారు.
ఉభయగోదావరి జిల్లాలే లక్ష్యంగా పావులు
కాకినాడ, మే 9
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఓటమి నుంచి చాలా రకాలుగా గుణ పాఠాలు నేర్చుకుంది. ముఖ్యంగా అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమి బాధ నుంచి బయటకు వచ్చారు. పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా కూడా వేగం పెంచుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో ప్రజల మధ్యకు వచ్చి పోరాటం చేయాలని భావిస్తున్నారు. త్వరలో జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పరిశీలకులను నియమించారు. జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అనుబంధ విభాగాలను భర్తీ చేయాలని చూస్తున్నారు. ఇవి కొలిక్కి వచ్చిన తరువాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీనివచ్చే ఏడాది జూలైలో నిర్వహించాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. జూలై 8న వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకరకంగా పార్టీ ప్లీనరీని ఎన్నికల శంఖారావంగా జగన్ భావిస్తున్నారు.
అందుకే ఘనంగా నిర్వహించి పార్టీ శ్రేణులతో పాటు ప్రజలకు ఎన్నికల పిలుపు ఇవ్వాలని చూస్తున్నారు. తెలుగుదేశం మహానాడు తరహాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని నిర్వహించాలని చూస్తున్నారు. తద్వారా 2027 పాదయాత్ర ప్రకటన బహిరంగంగా అక్కడే ఇవ్వాలని భావిస్తున్నారు. 2017లో పాదయాత్ర ప్రకటన ఇలానే ప్లీనరీలో చేశారు.ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీని ఉభయగోదావరిజిల్లాలో నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాలో భారీ మూల్యం చెల్లించుకుంది. కనీసం ఖాతా తెరవలేదు. టిడిపి కూటమి క్లీన్ స్వీప్ చేసింది. జనసేన హవా ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ ఆ రెండు పార్టీలతో పోలిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. పైగా వైయస్సార్ కాంగ్రెస్ కీలక నేతలంతా పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ శ్రేణులు సైతం తీవ్ర నిరాశతో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్లీనరీ నిర్వహించడం ద్వారా.. సరికొత్త సంకేతాలు పంపించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారుప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి పార్టీల మధ్య సరైన సమన్వయం లేదు. ఒక్క పిఠాపురంలోతప్పించి.. మిగతా నియోజకవర్గాల్లో విభేదాలు కొనసాగుతున్నాయి.
దానిని క్యాష్ చేసుకోవడం ద్వారా.. అసంతృప్త నేతలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. 2029 ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలే కీలకమని భావిస్తున్నారు. అందుకే అక్కడ ప్లీనరీ నిర్వహించాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు.గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతంపై దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ నాయకులకు దిశ నిర్దేశం చేశారు. 2029లో కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసులకు భయపడితే రాజకీయం చేయలేమని ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు ఆదేశించారు. 2027 నుంచి పాదయాత్ర 2.0 ప్రారంభిస్తానని కూడా ప్రకటించారు. పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలని ఆదేశించారు. పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలని కూడా సూచించారు.2019 ఎన్నికలకు ముందు ఉన్న వాతావరణం క్రియేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఒకవైపు పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు. అదే సమయంలో ప్రజల్లో ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను వైయస్సార్ కాంగ్రెస్ వైపు టర్న్ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాడర్ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకటనపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Read more:Andhra Pradesh:మద్యం స్కాం.. అందరూ ఇరుక్కున్నట్టేనా