Vemulawada:భారత్ పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారత్ సైన్యానికి సంఘీభావంగా వేములవాడలో ప్రత్యేక పూజలు జరిపారు. భారత సైన్యానికి విజయం సంకల్పించాలని చండీ సహిత రుద్ర హోమం నిర్వహించారు. భారత్ పాక్ మధ్య ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలని దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పూజలు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు.
భారత్ విజయం కోసం రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
వేములవాడ
భారత్ పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారత్ సైన్యానికి సంఘీభావంగా వేములవాడలో ప్రత్యేక పూజలు జరిపారు. భారత సైన్యానికి విజయం సంకల్పించాలని చండీ సహిత రుద్ర హోమం నిర్వహించారు. భారత్ పాక్ మధ్య ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలని దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పూజలు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా భారత వైమానిక దళం, నావికాదళం, ఆర్మీ సైన్యానికి దైవిక బల రక్షణ మరియు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో
శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శౌర్యానికి, ధైర్యానికి ప్రతీకలైన భారత సైనికుల భద్రత, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం, అలాగే దేశవ్యాప్తంగా శాంతి మరియు సామరస్యం నెలకొనాలని ఆలయము నందు చండీ సహిత రుద్ర హోమం చేశారు.
భారతావని పై ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షం ఉండాలని, భారత సాయుధ దళాలకు సంపూర్ణ దిగ్విజయం చేకూరాలని ఆలయ అర్చకులు, ఉద్యోగులు కోరారు.