Cricket Buzz : క్రికెట్ అభిమానులకు శుభవార్త: విశాఖలో భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్!

Visakhapatnam Set to Host India vs New Zealand T20 Match in 2026

Cricket Buzz : క్రికెట్ అభిమానులకు శుభవార్త: విశాఖలో భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్!:ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విశాఖపట్నం నివాసితులకు శుభవార్త! త్వరలో విశాఖలో టీమిండియా మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20 మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం.

విశాఖకు టీమిండియా

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విశాఖపట్నం నివాసితులకు శుభవార్త! త్వరలో విశాఖలో టీమిండియా మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20 మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం.2026 జనవరి 21 నుండి జనవరి 31 వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా జనవరి 28న విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నాల్గవ టీ20 మ్యాచ్ నిర్వహించబడుతుందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానిక క్రికెట్ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గత కొంతకాలంగా హైదరాబాద్ లేదా వైజాగ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు పెద్దగా జరగకపోవడం, కేవలం ఐపీఎల్ మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కావడంతో ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది.అయితే, ఈ సిరీస్‌కు సంబంధించిన మ్యాచ్‌ల వేదికల్లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియానికి చోటు దక్కలేదని తెలుస్తోంది. విశాఖపట్నంలో ఒక టీ20 మ్యాచ్ జరగనుండగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌లను నాగ్‌పూర్, రాయ్‌పూర్, గువహటి మరియు తిరువనంతపురంలో నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో, మ్యాచ్ టిక్కెట్ల కోసం ఇప్పటినుంచే సిద్ధం కావాలంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read also:Maruthi : నాన్న జ్ఞాపకాల్లో మారుతి: మచిలీపట్నంలో నెరవేరిన కల

 

Related posts

Leave a Comment