KTR :బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా వన్ రేసింగ్ అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విచారణకు ఇప్పటికే మూడుసార్లు పిలిచారని, ఇంకో 30 సార్లు పిలిచినా వస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేటీఆర్ వ్యాఖ్యలు: కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, విచారణకు సిద్ధం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా వన్ రేసింగ్ అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విచారణకు ఇప్పటికే మూడుసార్లు పిలిచారని, ఇంకో 30 సార్లు పిలిచినా వస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్ళానని, ఇప్పుడు మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడనని ధైర్యం వ్యక్తం చేశారు.
ఈ రోజు ఉదయం పది గంటలకు ఏసీబీ కార్యాలయానికి బయలుదేరే ముందు, తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ తన ఆవేదనను వెలిబుచ్చారు. “తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకుంటామని అనుకోవద్దు” అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చట్టం, న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని, నిజం నిలకడ మీద తెలుస్తుందని ఆయన అన్నారు.
కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్, హరీశ్రావులను కూర్చోబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందిందని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు తనను విచారణకు పిలిచి మానసిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. విచారణ పేరుతో పిలిచి అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదని, అయితే తాము కేసులకు, అరెస్టులకు భయపడేవాళ్ళం కాదని కేటీఆర్ తేల్చిచెప్పారు.
Read also:Black Iceberg : కెనడాలో లక్ష ఏళ్ల నాటి నల్లటి మంచుకొండ: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్యం