Andhra : ఓటర్లను చైతన్యపరచడంలో ప్రాంతీయ మీడియా సహకారం అవసరం: పి.పవన్

Media's Crucial Role in Increasing Voter Turnout: ECI Deputy Director P. Pawan

Andhra : ఓటర్లను చైతన్యపరచడంలో ప్రాంతీయ మీడియా సహకారం అవసరం: పి.పవన్:ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల ఏర్పాటుకు ఎన్నికలు అత్యంత కీలకం అని, అటువంటి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని భారత ఎన్నికల సంఘం (ECI) ఉప సంచాలకులు పి.పవన్ స్పష్టం చేశారు.

ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపులో మీడియాదే కీలక పాత్ర: ఈసీఐ ఉప సంచాలకులు పి.పవన్

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల ఏర్పాటుకు ఎన్నికలు అత్యంత కీలకం అని, అటువంటి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని భారత ఎన్నికల సంఘం (ECI) ఉప సంచాలకులు పి.పవన్ స్పష్టం చేశారు. ఓటర్లను చైతన్యపరచడంలో ప్రాంతీయ మీడియా ప్రతినిధులు సహకరించాలని, తద్వారా ప్రాంతీయ స్థాయిలో ఈసీఐ కమ్యూనికేషన్ ప్రభావం, పరిధి మరింత విస్తరిస్తుందని ఆయన కోరారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం ఏపీ రాష్ట్ర సచివాలయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేక ముఖాముఖి చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పి.పవన్ ముఖ్యఅతిథిగా హాజరై మీడియా ప్రతినిధులతో ఆత్మీయంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన 23 నూతన కార్యక్రమాలను వివరించారు. ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రక్రియాత్మక సంస్కరణలు, చట్టపరమైన చర్యలు, ఈసీఐ నూతన ఆవిష్కరణలు, వనరుల గురించి ఆయన కూలంకషంగా తెలియజేశారు.

ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాల్లో భాగంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉప ఎన్నికలకు ముందు ప్రత్యేక సార్వత్రిక నమోదు (SSR) కార్యక్రమాన్ని చేపడుతున్నామని పవన్ తెలిపారు. ఇకపై ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌లు మరింత ఉపయోగకరంగా మారనున్నాయని, వాటిలో ఓటరు సీరియల్ నంబర్, పార్ట్ నంబర్ స్పష్టంగా కనిపించేలా మార్పులు చేశామని చెప్పారు.

మరణాల నమోదుకు సంబంధించిన డేటాను ఆర్‌జీఐ డేటాబేస్ నుండి సేకరించి, ధృవీకరణ తర్వాత ఓటరు జాబితాలో మార్పులు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి గరిష్ఠంగా 1200 మంది ఓటర్లకే అనుమతిస్తున్నామని, ఓటర్లకు మొబైల్ డిపాజిట్ సదుపాయం కల్పిస్తున్నామని, అలాగే అపార్ట్‌మెంట్లు, కాలనీల్లో అదనపు పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

యూనిక్ EPIC నంబర్ పద్ధతి అమలు ద్వారా డూప్లికేట్ EPIC నంబర్ల సమస్యను పరిష్కరించినట్లు పవన్ వెల్లడించారు. భారత ఎన్నికల సంఘం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని పలు వెబ్‌సైట్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ ఇష్టాగోష్ఠి చర్చా కార్యక్రమంలో ఎన్నికల ప్రక్రియపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

 

Read also:NRI : అమెరికాలో కష్టాలు: ఉన్నత చదువుల తర్వాత ఉద్యోగంలో సవాళ్లు

Related posts

Leave a Comment