KCR : కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్, నివాసానికి పయనం

KCR Discharged from Yashoda Hospital, Returns Home

KCR : కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్, నివాసానికి పయనం:బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన, నేడు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ఆయన నేరుగా నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

పూర్తి ఆరోగ్యంతో కేసీఆర్ డిశ్చార్జ్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన, నేడు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ఆయన నేరుగా నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

ఈ నెల 3వ తేదీన జ్వరంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరగడం, సోడియం స్థాయిలు పడిపోవడంతో కేసీఆర్‌ను కుటుంబసభ్యులు వెంటనే యశోద ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందించారు.

ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన రక్తంలో చక్కెర, సోడియం స్థాయిలు సాధారణ స్థితికి చేరాయని స్పష్టం చేశారు. జ్వరం కూడా తగ్గడంతో నిన్నటి నుంచే ఆయన ఉత్సాహంగా ఉన్నారని, పార్టీ నేతలతో కూడా మాట్లాడారని తెలిసింది. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడటంతో ఆయన్ను డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు అనుమతించారు.

Read also:AP : తాడిపత్రి రాజకీయం: కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రవేశంపై ఉత్కంఠ

 

 

Related posts

Leave a Comment