Vallabhaneni Vamsi : జైలు జీవితం తర్వాత జగన్‌ను కలిసిన వంశీ: ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన వైసీపీ అధినేత

Former MLA Vallabhaneni Vamsi Expresses Gratitude to Jagan for Support

Vallabhaneni Vamsi : జైలు జీవితం తర్వాత జగన్‌ను కలిసిన వంశీ: ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన వైసీపీ అధినేత:గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీ ఈరోజు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. సుమారు 140 రోజుల జైలు జీవితం తర్వాత బుధవారం విడుదలైన ఆయన, మరుసటి రోజే జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వల్లభనేని వంశీ – జగన్ భేటీ: కక్ష సాధింపు చర్యలపై చర్చ?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీ ఈరోజు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. సుమారు 140 రోజుల జైలు జీవితం తర్వాత బుధవారం విడుదలైన ఆయన, మరుసటి రోజే జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ, కష్టకాలంలో అండగా నిలిచినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్, వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. జైలులో ఉన్న సమయంలో వంశీ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.

కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగానే వంశీపై మొత్తం 11 కేసులు నమోదు చేసి వేధించారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ కేసుల కారణంగానే ఆయన సుమారు నాలుగున్నర నెలల పాటు విజయవాడ జైలులో ఉండాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. వంశీకి న్యాయస్థానంలో బెయిల్ లభించినా, దానిని రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించడంతో ఆయన బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు.

Read also:Apple : యాపిల్‌కు షాక్: భారత్ నుంచి చైనా ఉద్యోగులను వెనక్కి పంపుతున్న ఫాక్స్‌కాన్

 

Related posts

Leave a Comment