మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కోరిన విద్యార్థి ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణిలో సాధారంగా ప్రజా, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించాలిని కోరుతూ ప్రజలు వస్తుంటారు. కానీ జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 6వ తరగతి విద్యార్ధి తాను చదువుతున్న ప్రబుత్వ పాటశాలలో వసతులు కలిపించాలని పిర్యాదు చేయడం అందరిని అచ్చర్యనికి గురి చేసింది. సాధారణంగా ప్రభుత్వ పాటశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థి సంఘ నాయకులు ఫిర్యాదు చేయడం చూస్తుంటాం కానీ విద్యార్థి తాను చదువుకున్న పాఠశాలలో వసతులు సక్రమంగా లేవని ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి ని అధికారులు పేర్కొంటున్నారు.
జగిత్యాల పట్టణంకు చెందిన విశ్వంక్ పట్టణంలోని ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్ లో 6 వ తరగతి చదువుతున్నాడు. అయితే తమ పాఠశాలలో బాత్రూములు, త్రాగునీరు, ఫ్యాన్లు సౌకర్యం సక్రమంగా లేదని ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేశాడు. అధికారులు వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం ఒక వైపు మన ఊరు మనబడి కార్యక్రమం పేరుతో పాఠశాల అభివృద్ధి చేస్తుంటే ఇలా విద్యార్థి వచ్చి మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ కార్యాలయం పలువురిని ఆశ్చర్యాన్ని గురిచేసింది.