A place where you need to follow for what happening in world cup

HOT NEWS

చైన్ స్నాచింగ్‌లో కొత్త స్టైల్.

0

ఇంటింటికి తిరిగి పాలు పోసే యువకుడి క్రైమ్ కహానీ బయటపడింది. పాల పోస్తున్న ఇంటికే కన్నం వేశాడు. కానీ సీన్ రివర్స కావడంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌ సమీపంలో ఏఏఏ అపార్ట్‌మెంట్‌లో టీచర్లు ప్రసాద్‌, ఉషారాణి దంపతులు నివాసం ఉంటున్నారు. గత నెల 20న ఇంటికి తాళం వేసి ఇద్దరు విధులకు వెళ్లారు.. తిరిగొచ్చి చూసేసరికి ఇంట్లో చోరీ జరిగింది.ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేశారు.

 

ఆ అపార్ట్‌మెంటుకు వెళ్లే దారిలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. అనుమానాస్పదంగా కదలికలు ఉండటంతో గుంతకల్లుకు వెళ్లే రోడ్డులో నివాసం ఉండే పాల వ్యాపారి ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ప్రశ్నిస్తే.. దొంగతనం డొంక మొత్తం కదిలింది. అతడి వేలి ముద్రలు సేకరించి పోల్చి చూడగా అతడే చోరా చేశాడని తేలింది.అతడు గతంలో మరో టీచర్ విజయలక్ష్మి, విద్యుత్తు శాఖ కాంట్రాక్టర్ నాగలింగస్వామి ఇళ్లలో కూడా చోరీలు చేసినట్లు గుర్తించారు. అక్కడ దొంగతనం చేసినట్లు అతడి వేలి ముద్రల ద్వారా తేలింది. ఈ మూడు చోరీ కేసులకు సంబంధించి.. మొత్తం 21 తులాల బంగారు ఆభరణాలు, 62 తులాల వెండి ఆభరణాలతోపాటు రూ.2.48 లక్షల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

వీటి మొత్తం విలువ రూ.14.49 లక్షలు అని పోలీసులు చెబుతున్నారు.ఎర్రిస్వామి చోరీ చేసిన సొత్తును అమ్మి ఆవులను, కెమెరా కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితుడిని ఉరవకొండ కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్‌ రిమాండ్ విధించారు. అతడు ఉదయం సమయంలో పాల వ్యాపారం చేస్తూ.. ఆ తర్వాత ప్లాన్ చేసి పోలు పోసే ఇళ్లలోనే చోరీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.మరో కేసులో ఏడునెలల బాలుడిని మంత్రాలయంలో అపహరించి గుంతకల్లులో విక్రయించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒకే టికెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణం..

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కాంచాపురంకు ఆంజనేయులు, అంకమ్మలు భార్యాభర్తలు. ఇద్దరు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆంజనేయులు కుటుంబంతో కలిసి మంత్రాలయం రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తుండగా.. వారి కుమారుడ్ని నిందితులు అపహరించారు. అక్కడి నుంచి తీసుకెళ్లి గుంతకల్లులో వలిబాషకు రూ.3 లక్షలకు అమ్మేశారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు నిందితుల కోసం గాలించి చివరికి అరెస్ట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.