రాయికల్ పట్టణంలో ఉపాధి హామీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 4 వేలు లంచం తీసుకుంటూ ఉపాధి హామీ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన కోల శంకరయ్య అనే రైతు జాతీయ ఉపాధి హామీ కింద పశువుల పాక షెడ్ నిర్మాణం కోసం రూ. 57 వేలు మంజూరు అయ్యాయి. పని కార్మికుల నిమిత్తం రూ. 12వేలు పోగా రావాల్సిన రూ. 45 వేలు మంజూరు చేసేందుకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ దీపిక, టి.ఎ విజేష్ లంచం కోసం వేధిస్తూ బిల్ చేసేందుకు రూ. 5 వేల లంచం అడుగగా రూ. 4 వేల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.
దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించగా ఎసిబి డిఎస్పి రమణ అధ్వర్యంలో మంగళవారం దాడులు చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ దీపిక రూ. 4 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టు పడింది. మరో నిందితుడు విజేష్ పరారిలో ఉన్నట్లు తెలిపారు. నిందుతురాలిని రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ డి.ఎస్.పి పేర్కొన్నారు.ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రాజేంధర్, రాము, తిరుపతి పాల్గొన్నారు. ఏ శాఖలోనైనా ప్రభుత్వ అధికారులు లంచం కోసం వేధిస్తే 9154388954, 9154388957 ఈ నెంబర్లకు సంప్రదించాలని ఏసీబీ డి.ఎస్.పి తెలిపారు.