జంగారెడ్డిగూడెం:జంగారెడ్డిగూడెం పట్టణంలో స్కూల్ విద్యార్థి పై ఆగంతకుడు దాడి చేశాడు.తల్లిదండ్రుల వివరాల ప్రకారం పట్టణానికి చెందిన సంజయి అనే విద్యార్థి స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అదే స్కూల్లో సంజయ్ తల్లి ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే ఈరోజు కూడా స్కూలుకి బయలుదేరుతుండగా ఇంట్లోకి వచ్చిన అగంతకుడు మీ డాడీ ఎక్కడ అని అడిగి లేరు అని చెప్పడంతో అతనితో తెచ్చుకున్న పదునైన ఆయుధంతో తనపై దాడి చేశాడని తెలిపారు.
స్కూలుకి ఇంకా సంజయ్ చేరుకోలేదు అనే సమాచారాన్ని తండ్రికి తెలియపరచగా హుటాహుటిన ఇంటికి వచ్చిన తండ్రికి రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకుని చూసి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స అనంతరం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వచ్చిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని ఇంతకుముందు ఎప్పుడు అతన్ని చూడలేదని విద్యార్థి సంజయ్ తెలిపాడు.