తహసీల్దార్ ద్వారా జిల్లా కలెక్టర్ కు విడిసి విజ్ఞప్తి:జగిత్యాల,
జిల్లా లోని బుగ్గారం మండలంలోని బీర్సాని గ్రామాన్ని వెల్గటూర్ మండలంలో కలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.15 ను రద్దు చేయాలని మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ద్వారా జిల్లా కలెక్టర్ కు బుగ్గారం గ్రామాభివృద్ధి కమిటి విజ్ఞప్తి చేసింది.ఇప్పటికే బుగ్గారం మండలం 11 గ్రామాలతో అతి చిన్న మండలంగా ఉందని, ఇందులో గల గ్రామాలను తొలగించి మరింత చిన్న మండలం గా చేయవద్దని గ్రామ అభివృద్ధి కమిటి అధ్యక్షులు నక్క చంద్రమౌళి ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కోరారు.
గతంలో నియోజకవర్గ కేంద్రం గా, నేడు మండల కేంద్రంగా ఉన్న బుగ్గారం నేటికీ సరైన అభివృద్ధి కి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి కొప్పుల ఈశ్వర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు ప్రత్యేక చొరవ తీసుకొని బుగ్గారం మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విడిసి కోర్ కమిటి చైర్మన్ చుక్క గంగారెడ్డి, కోశాధికారి చీగిరి అంజన్న, నక్క రాజలింగు, కప్పల శంకర్, రాగన్న, రామన్న, ఏలేశ్వరం గౌరి శంకర్, దిండిగాల సత్యనారాయణ, కొక్కెర రాజమల్లు, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.