సిద్దిపేట: రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతోనే యథేచ్చగా ములుగు మండలంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని,తక్షణమే మట్టి తొవ్వాలను నిలువరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ములుగు తహశీల్ధార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని పలు గ్రామాల్లో అధికారుల ప్రోత్సాహంతో అక్రమంగా మట్టి తవ్వకాలను నిర్వహిస్తున్నారని ములుగు తహశీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంచె చేనుని మేసింది అన్న సామెతలాగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటే,బిఆరెస్ నాయకులు మట్టి తవ్వకాలతో గ్రామాలను దోచుకుంటున్నారని ఎద్దేవాచేశారు.పంట పొలాలను ధ్వంసం చేస్తూ మట్టిమాపియ లక్షలు రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారని బీజేపీ నాయకులు వాపోయారు.ఇక చర్యలు తీసుకోవాల్సిన అధికారులే పూర్తి అండదండలుగా నిలుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.కావున జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు చొరవ చూపి ఈ దందాకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని,మట్టి మాఫియా ఆగడాలను నిలువరించాలని కోరారు.