బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కుదరదని బీజేపీ చెప్పిందన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్ ఇవ్వమని అడిగితే కేంద్రం పట్టించుకోలేదన్నారు. 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యారానికి ఐరన్ ఓర్ ఇవ్వరు కాని1800 కిలోమీటర్ల దూరంలోని ముంద్రాకు ఐరన్ ఓర్ దొడ్డిదారిన తరలిస్తున్నారన్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ మూతపడాలని మోదీ ప్రభుత్వ ఎజెండా. మోదీ ప్రభుత్వ ఎజెండా వెనక అదానీ హస్తం ఉంది.