Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

దోస్త్..అడ్మిషన్లు షురూ..

0

తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్(డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఇందులో భాగంగా  డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. శాతవాహన యూనివర్సిటీలో  జూన్ 10 వరకు దోస్త్ తొలివిడత సీట్ల భర్తీ ప్రారంభం కానుంది. మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఖాళీగా ఉన్న డిగ్రీ సీట్లను జూన్ 16న కేటాయిస్తారు.

కడియం నర్సరీలకు వేసవి తాపం. మండే ఎండలకు విలవిలలాడుతున్న మొక్కలు.

తిరిగి జూన్ 16 నుంచి జూన్ 26 వరకు రెండో విడతలో సీట్ల భర్తీ చేపడతారు. జూన్ 30న సీట్ల కేటాయింపులు జరగనున్నాయి. జులై 1 నుంచి జులై 6 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, జులై 10న సీట్ల కేటాయింపు నిర్వహిస్తారు. జులై 17వ తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి.దోస్త్ రిజిస్ట్రేషన్ నేటి నుంచి ప్రారంభం అవ్వడంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల వివరాలను అధికారులు ప్రకటించారు.

 

ఇందుకు సంబంధించి యూనివర్సిటీ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. గతేడాది శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు, భర్తీ అయిన సీట్లు, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయనే వివరాలను సేకరించి నివేదికను రూపొందించారు.ఆ నివేదికను వీసీ ముందు ఉంచారు. వీసీ పరిశీలించిన అనంతరం ఆయా కాలేజీలకు కేటాయించిన సీట్లు ఇవాళ ప్రకటించనున్నారు. కరోనా దెబ్బతో చాలా ప్రైవేట్ కాలేజీ మూతపడ్డాయి. కాలేజీలను మూసివేసేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు అనుమతి కోరినట్లు సమాచారం.

 

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు దోస్త్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలలో అడ్మిషన్ పొందవచ్చు. విద్యార్థులు దోస్త్ ద్వారా సులభంగా అడ్మిషన్ పొందేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.విద్యార్థులు ముందుగా తమ ఫోన్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.అనంతరం https://dost.cgg.gov.in వెబ్ లైట్ లో లాగిన్ అయిన దోస్త్ ఐడీ, పిన్ నెంబర్ జనరేట్ చేసుకోవాలి. వీటితో అప్లికేషన్‌ను నింపాలి. దరఖాస్తులో కోర్సులు, కాలేజీల వారీగా ప్రాధాన్యతా వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి.

కొత్త సచివాలయంలో కేబినెట్.

విద్యార్థులు పెట్టుకున్న కాలేజీలో సీటు వస్తే అక్కడికి వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. కౌన్సెలింగ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా ఎంపిక చేసుకున్న కళాశాలకు వెళ్లి సర్టిఫికెట్లు సమర్పించి, ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఎస్ఆర్ఆర్ కళాశాల, కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దోస్త్ సేవా కేంద్రాలను ఏర్పాటుచేశారు. విద్యార్థులు ఇక్కడ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ సమయంలో తప్పులు చేస్తే ఈ కేంద్రాల వద్ద సరిచేసుకోవచ్చు.

 

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie