ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న అష్టోత్తర శత కుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి యజ్ఞం మహా పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి పాల్గోన్నారు. సీఎం వైయస్.జగన్కు శేష వస్త్రం అందజేసి, వేద పండితులు వేదాశీర్వచనాలతో స్వాగతం పలికారు. ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ తదితరులు హజరయ్యారు.
అభిషేక మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సీఎం పట్టుచీర సమర్పించారు. అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు పాల్గోన్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు..