- బీజేపీ ఆఫీస్ ముట్టడి
- అడ్డుకున్న పోలీసులు
ముద్ర ప్రతినిధి, జనగామ:కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్ట భద్రత కల్పించి పార్లమెంటు సమావేశాలలో బిల్లును ప్రెవేశపెట్టి ఆమోదం తెలపాలని ఎమ్మార్పీఎస్ లీడర్లు డిమాండ్ చేశారు. వర్గీకరణపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ 12 మండలాలకు ఎమ్మార్పీఎస్ నాయకులు జనగామ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పార్టీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన 100 రోజులలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ఆమోదం తెలుపుతామని వాగ్దానం చేసిన బీజేపీ ఆ విషయం మర్చిపోయిందన్నారు. దళితులను మోసం చేస్తున్న బీజేపీని నిలదీయాలన్నారు. ఈ పార్లమెంటు సామావేశాలలోనే బిల్లుకు ఆమోదం తెలిపాలని డిమాండ్ చేశారు. లేకుంటే మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ లీడర్లు పాల్గొన్నారు.