విశాఖపట్నం: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపె ట్టిన బడ్జెట్ తో ఏపీ కి అన్యాయం జరిగిందని, ఉత్తరాంధ్ర ,విశాఖ రైల్వే జోన్ కి నిధులు కేటాయింపులోనూ వివక్ష చూపించారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి ఆరోపించారు.కేంద్రబడ్జెట్లో ఉత్తరాంధ్ర జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ రైల్వే డిఆర్ఎం కార్యాల యం వద్ద సీపీఐ నిరసన చేపట్టింది.
ఈ సందర్భంగా సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని, ప్రధాని విశాఖ పర్యటన నేపధ్యంలో విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్ ఏర్పాటు కానుందని ఓఎస్డీ ని సైతం నియమించి డి పి ఆర్ ఇచ్చి నేటికి రెండు సంవ త్సరాలు గడిచినా దాని అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.