A place where you need to follow for what happening in world cup

పోన్లో సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మొద్దు …

0
    • పోన్.మెసేజ్ లింక్ క్లిక్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
    • కడప ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్

కడప: ఇంటి వద్ద ఉంటూ ఉద్యోగాలు చేస్తూ రోజుకు రూ. వేలల్లో సంపాదించండి…అంటూ వచ్చే మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్  తెలిపారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు అమాయకులైన వారిని మాయమాటలతో మభ్యపెడుతూ మెసేజ్ లింక్ తో ఉన్న నకిలీ వెబ్ సైట్ ల పేరు చెబుతూ యూట్యూబ్ లో యాడ్స్ ప్రమోషన్ చేస్తే భారీగా కమిషన్ ఇస్తామని ఆశచూపి మోసాలకు తెగబడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్.పి  తెలిపారు.

ఇందుకు కొంత పెట్టుబడి పెట్టాలంటూ మాయ మాటలతో ఆశ చూపి ఇన్ కం ట్యాక్స్, ప్రోసెసింగ్ చార్జిలపేరిట రూ.లక్షలకు లక్షలు కొల్లగొడుతున్నారని ఎస్.పి వివరించారు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దని జిల్లా ఎస్.పి సూచించారు. బ్యాంక్ ఖాతా తో పాటు ఇతర విలువైన వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరితో షేర్ చేయవద్దని జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్  తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.