మదనపల్లె
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిలో పది శాతం అభివృద్ధి కూడా ఇప్పటి ప్రభుత్వం మదనపల్లె నియోజకవర్గంలో చేపట్టలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శించారు. నేడు మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు షాజహాన్ బాషా జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డి సాహెబ్, నాగూర్ వలి, ఇంతియాజ్, గిరీష్, షంషీర్, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశానని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో పది శాతం అభివృద్ధి కూడా జరగలేదని విమర్శించారు. తన జన్మదినాన్ని నిర్వహించిన పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.