A place where you need to follow for what happening in world cup

అందుబాటులో ఉన్నత విద్య

0
  • వైవీయూలో దూరవిద్య కోర్సులు
  • జూన్ నుంచి ప్రారంభం
  • ఉపకులపతి ఆచార్య రంగ జనార్ధన

యోగి వేమన విశ్వవిద్యాల యంలో దూరవిద్య కోర్సులు ప్రారంభిస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య జింక రంగ జనార్ధన్ వెల్లడించారు. డి డి ఈ సంచాలకులు ఆచార్య పిఎస్ షావలి ఖాన్ అధ్యక్షతన కుల సచివులు ఆచార్య వై.పి.  వెంకటసు బ్బయ్య, ప్రధానాచార్యులు కె. కృష్ణారెడ్డి తో కలిసి వివిధ విభాగాల అధిపతులు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, డీన్ లతో కలిసి దూరవిద్య పై సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మూడు ఫేస్ ల లో   22 కోర్సులను ప్రారంభించను న్నామన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి తొలివిడతగా ఏడు డిగ్రీ కోర్సులు, ఏడు పీజీ కోర్సులు, రెండు డిప్లమో కోర్సులను ప్రారంభిస్తున్నామన్నారు.  అంతకు ముందుగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సుల గురించి డీన్లతో సమీక్షించారు.

కొత్త కోర్సులకు సంబంధించి సిలబస్, విధివిధానాలపై బోర్డ్ ఆఫ్ చైర్మన్ ల చర్చించారు. అధ్యయన కేంద్రాలను గుర్తించాలని, నాణ్యమైన మెటీరియల్ను రూపకల్పన చేయాలని సూచించారు. డి డి ఈ సంచాలకులు షావలి ఖాన్ మాట్లాడుతూ జూన్లోపు కోర్సులకు సంబంధించి యూజీసీ నుంచి అనుమతి పొందుతామన్నారు. కుల సచివులు ఆచార్య వైపి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ప్రామాణికమైన విధానాలతో దూర విద్యను జిల్లా లోని విద్యార్థులకు అందుబాటులోకి తీస్తున్నామ న్నారు. వివిధ కారణాలతో సహిత విద్యను అందుకోలేని వారికి ఇది అద్భుత అవకాశం అన్నారు. కార్యక్రమంలో డి డి ఈ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ బాబు, డీన్లు, బి ఓ ఎస్ చైర్మన్లు, అన్ని శాఖల అధిపతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.